తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు అగ్ర హీలకు భార్యగా, చెల్లెగా నటించి తర్వాత కాలంలో హీరోలకు అమ్మగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన తెలుగు నటి బిందు మాధవి ఒంగోలు లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. సినిమా తర్వాత పలు తెలుగు సీరియల్స్ లో నటించిన బింధు మాధవి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది.అనారోగ్యంతో ఈమె కోమాలోకి వెళ్లినపుడు ఆసుపత్రి వర్గం వారు చేర్చుకోమన్నారు.


టీవినటి బింధు మాధవి  


తర్వాత నీమ్స్ లో చికిత్స నిమిత్తం చేర్చగా అక్కడ వారు రెండు లక్షలు డిమాండ్ చేశారు. అంత   డబ్బు తాము కట్టలేమని ఆమె తరుపు కుటుంబ సభ్యులు తెలపడం తో ప్రస్తుతం ‘మా’ సభ్యుడు గా ఉన్న కాదంబరి కిరణ్, మరిసీనియర్ నటి అయిన కవిత లు ఆమె వైద్యం కోసం సహాయం చేశారు. అయితే తాజాగా ఆమె ఒంగోలు ఆసుపత్రి లో చికిత్స పొందుతూ తన తుది శ్వాస విదించింది. ఆమె మృతి పట్ల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) సభ్యులు తీవ్ర సంతాపం తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: