సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా వినిపిస్తున్న న్యూస్ కాజల్ అగర్వాల్. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ కి సంబంధించిన ఓ హాట్ న్యూస్ బిటౌన్ లో హల్ చల్ చేస్తుంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, ‘చందమామ’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన బ్యూటీ కాజల్ అగర్వాల్.

ఇక‘మగధీర’ సినిమాతో స్టార్డం తెచ్చుకొని స్టార్ హీరోయిన్ గా మారిపోయింది ఈ బ్యూటీ. కాజల్ అగర్వాల్ పదేళ్ళ కెరీర్లో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ అందరి ప్రశంసలను అందుకుంటుంది.  టాలీవుడ్ లో కాజల్ చేసిన చివరి సినిమా టెంపర్ మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ బాలీవుడ్ లో చేస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘దో లఫ్జోన్ కి కహాని’.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మలేషియాలోని కౌలా లాంపూర్ లో జరుగుతోంది. ఈ సినిమాలో కాజల్ కి జోడీగా రన్దీప్ హుడా నటిస్తున్నాడు. ప్రస్తుతం కౌలా లాంపూర్ లో రన్దీప్ హుడా, కాజల్ అగర్వాల్ పై కొన్ని రొమాంటిక్ సీన్స్ ని షూట్ చేస్తున్నారు. రన్థీప్ హుడా, కాజల్ అగర్వాల్ ఇద్దరూ ప్రవేట్ గా రొమాన్స్ చేసుకుంటూ దిగిన సెల్ఫీ ఫోటోలు కొన్ని బయటకు లీక్ అయ్యాయంట.

బిటౌన్ ప్రస్తుతం ఆ ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన ఏ విషయం వీరికి తెలియదన్నట్టుగా ఎంచక్కా షూటింగ్ లో పాల్గొంటున్నారు. త్వరలోనే లీక్డ్ సెల్ఫీ ఫోటోల వ్యవహారంపై కాజల్ రియాక్ట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: