చిత్ర పరిశ్రమలో వారసుల సందడి ఎప్పుడైనా ఉంటుంది. అది టాలీవుడ్ కావొచ్చు, బాలీవుడ్ కావొచ్చు ఏ భాష చిత్రాలైనా వారసత్వం పరంపర కొనసాగుతూనే ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమలు నందమూరి, మెగా, అక్కినేని, నాయుడు వారుసులు వస్తూనే ఉన్నారు. అయితే తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్స్ వారసులు మాత్రం చాలా అరుదుగా వచ్చారు తాజాగా సహజ నటి జయసుధ తనయుడు హీరోగా పరిచయం అవుతున్నాడు. ‘బస్తీ’ చిత్రంతో శ్రేయన్ కపూర్ హీరోగా వెండితెరకు పరిచయం అవుతున్నాడు.


 శ్రేయన్ కపూర్, జయసుధ,ప్రగతి


ఈ సినిమా వస్తున్న విషయం కానీ షూటింగ్ జరుపుకుంటున్న విషయం కానీ ఎక్కువగా ఎక్స్ పోజ్ చేయకుండా సినిమా దాదాపు పూర్తి చేసి షాక్ ఇచ్చారు. త్వరలోనే ఆడియోవేడుక నిర్వహించాలనే ప్రపోజల్ లో ఉన్నారు, జూలై లేదా ఆగష్టు లో సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బస్తీ సినిమాకు వాసు మంతెన దర్శకత్వం వహించారు. వారసుల రాజ్యం రాజ్యమేలుతున్న ఈ సినిమా రంగంలోకి మరో వారసుడు వచ్చాడు . మరి శ్రేయాన్ కపూర్ తన సత్తా చాటుతాడా లేక చతికిల బడతాడా చూడాలి . 


మరింత సమాచారం తెలుసుకోండి: