ఈ సంవత్సరం తెలుగు ఇండస్ట్రీలో విడుదలైన చిత్రాలు బాక్సాఫీస్ షేక్ చేస్తున్నాయంటే ఆశ్చర్యం లేదు.. పటాస్,టెంపర్,సన్నాఫ్ సత్యమూర్తి, బాహుబలి  రీసెంట్ గా రిలీజ్ అయిన శ్రీమంతుడు సూపర్ హిట్ కావడమే కాక భారీగా కలెక్షన్లు వసూళ్లు చేస్తున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘శ్రీమంతుడు' మూవీ ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది.. మొట్ట మొదటి సారిగా మహేష్ బాబు సొంత ప్రొడక్షన్ లో  నిర్మాణ సారధ్యం వహించాడు ఈ సినిమా ఘన విజయం సాధించడంపై మహేష్ బాబు చాలా ఆనందంగా ఉన్నారట.


 సినిమాలు మంచి విజయం సాధిస్తే.. తమిళ నాట హీరో, హీరోయిన్లు తమ సిబ్బందికి గోల్డ్ కాయిన్స్, మంచి వాచీలు, ఎలక్ట్రానిక్ గూడ్స్ బహుమతులు ఇవ్వడం ఆనవాయితీగా పెట్టుకున్నారు..ఇదే కార్యక్రమం ఇక్కడ ‘శ్రీమంతుడు’ మహేష్ బాబు కూడా చేయాలని నిశ్చియించినట్లు తెలుస్తుంది.. దీనికోసం ఆయన తన సిబ్బందికి  అదిరిపోయే గిఫ్ట్ లు ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ లో ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల భారీ కలెక్షన్లు రాబట్టింది.  తొలి మూడు రోజుల్లోనే ఈ చిత్రం 41 కోట్లు వసూలు చేసింది.


శ్రీమంతుడు చిత్రంలో మహేష్ బాబు


ఇప్పటి మహేష్ బాబు తన కుటుంబానికి చెందిన బ్యానర్ లోనే నటించారు ఆయన సోదరుడు రమేష్, సోదరి మంజుల నిర్వహణ లోనే ఉండేవి.. కానీ మొట్ట మొదటి సారిగా మహేష్ బాబు స్వయంగా ‘జి మహేష్ బాబు ఎంటర్టెన్మెంట్ష్ ప్రై.లి' పేరుతో కొత్త బేనర్ స్థాపించి ‘శ్రీమంతుడు' సినిమాతో తనే స్వయంగా నిర్మాత అవతారం ఎత్తారు.  వస్తూ వస్తూనే సూపర్ డూపర్ హిట్ కొట్టేయడంతో ఆయన కుటుంబ సభ్యులు కూడా అమితానందంతో ఉన్నారట. ‘సొంత ఊరికి ఎంతో కొంత చేయాలని..లేదంటే లావెక్కి పోతారు’ అనే కాన్సెప్ట్ తో అద్భుతంగా తీర్చిదిద్దారు దర్శకులు కొరటాల శివ. ఈ చిత్రంలో మహేష్ సరసన శ్రుతి హాసన్ నటించగా జగపతి బాబు, రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్రలు పోషించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: