బ్రిటన్ కు చెందిన భారతీయ మోడల్ అమీ జాక్సన్ తన 16వ ఏటనే మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. 2009లో మిస్ టీన్ వరల్డ్ గానూ, 2010లో మిల్ లివర్ పూల్ గానూ నిలిచింది ఎమీ. ఆ తరువాత తమిళ సినీ దర్శకుడు ఎ.ఎల్.విజయ్ 2010లో తీసిన తమిళ చిత్రం మద్రాసపట్టిణంలో హీరోయిన్ ఎంపిక చేశాడు. అలా ఎమీ లండన్ లో మోడల్ గా కెరీర్ కొనసాగిస్తున్న సమయంలోనే, భారత్ లో వివిధ భాషల్లోని సినిమాల్లో నటించడం ప్రారంభించింది.
2012లో ఆమె నటించిన మొదటి బాలీవుడ్ సినిమా ఏక్ దీవానా థా విడుదలైంది. తర్వాత తెలుగులో రాంచరణ్ హీరోగా ‘ఎవడు’ విడుదలైంది. ఆ తరువాత 2015లో ఎమీ ప్రభుదేవా దర్శకత్వంలో,అక్షయ్ కుమార్ నటించిన సింగ్ ఈజ్ బ్లింగ్ సినిమాలో నటించింది. శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా నటించిన ‘ఐ’చిత్రంలో నటించింది.
అంతే కాదు సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన రోబో 2.0 చిత్రంలో కూడా నటించింది. అయితే సోషల్ మీడియాలో ఈ అమ్మడు కొన్ని హాట్ హాట్ ఫోటోలు అప్ లోడ్ చేస్తూ కుర్రాళ్లకు సెగలు పుట్టిస్తుంది. తాజాగా ఈ అమ్మడు మరో హాట్ ఫోటో సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది..ఈ ఫోటోలో బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు.
శరీరాన్ని టూ పీస్లో బంధించి సముద్ర తీరంలో ఉన్న స్విమ్మింగ్ ఫూల్లో ప్రియుడికి అధర చుంబన రుచి చూపిస్తూ.. తన్మయంతో రిలాక్స్ చైర్లో ప్రియుడితో పెనవేసుకుని ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసి షాక్ ఇచ్చింది అమీ.తరచూ ప్రియుడితో కలిసి వెకేషన్ టైమ్ను ఎంజాయ్ చేస్తోంది అమీ. ఇప్పుడు ఈ రొమాంటిక్ జంట యూరప్లో విహరిస్తోంది.