తెలుగు సినిమాకు ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చేలా చేసిన దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి తర్బాత చేస్తున్న మెగా మల్టీస్టారర్ మూవీపై ఓ సెన్సేషనల్ న్యూస్ ఇద్దరి స్టార్స్ ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేస్తుంది. ఎన్.టి.ఆర్, రాం చరణ్ తో కలిసి సినిమా చేయాలనుకోవడమే ఓ సాహసం.. అది కూడా జక్కన్న ఆ సినిమా చేస్తుండటం ఇక ఆ సినిమా అంచనాలకు ఆకాశమే హద్దు అనేలా మారింది.


డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా నవంబర్ మొదటి వారం నుండి షూటింగ్ జరుపుకోనుంది. ఇప్పటికే హైదరాబాద్ పరిసర ప్రాంతంలోని అల్యుమినియం ఫ్యాక్టరీలో వర్క్ షాప్ ఏర్పాటు చేసిన రాజమౌళి మొదటి షెడ్యూల్ అక్కడే ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. అంతేకాదు ఈ షెడ్యూల్ లోనే ఇంటర్వల్ సీన్ షూట్ చేస్తున్నారట.


సినిమాకు హైలెట్ గా నిలిచే సీన్స్ లో ఒకటైన ఈ ఇంటర్వల్ సీన్ లో ఎన్.టి.ఆర్, చరణ్ ఇద్దరు ఒకేసారి స్క్రీన్ పై కనిపిస్తారట. అప్పటిదాక కలుసుకోని వీరు ఇంటర్వల్ లో ఒకరికి ఒకరు ఎదురుపడతారట. ఈ ఎపిసోడ్ లోనే ఫైట్ కూడా ఉంటుందట. దీని కోసం 45 రోజులు షెడ్యూల్ ప్లాన్ చేశారని తెలుస్తుంది.


రాం లక్ష్మణ్ యాక్షన్ సీన్స్ కంపోజింగ్ లో ఈ యాక్షన్ ఎపిసోడ్స్ షూట్ చేస్తారట. మొత్తానికి రాజమౌళి ట్రిపుల్ ఆర్ ను మరో బాహుబలిలా ప్లాన్ చేస్తున్నాడు. కచ్చితంగా ఈ సినిమా బాహుబలి రేంజ్ కు వెళ్తుందని చెప్పొచ్చు. ఇక సినిమాలో హీరోయిన్స్ ఎవరన్నది ఇంకా నిర్ణయించలేదు. దానికి సంబందించిన అప్డేట్ త్వరలో తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: