కొన్ని ఘటనలు చాలా ఆశ్చర్యం కలిగిస్తాయి.. ఇలా కూడా జరగి ఉంటుందా అనిపిస్తుంటాయి. అలాంటిదే ఈ తమాషా కూడా.. ఒక సినిమాలో నటిస్తున్న హీరో, హీరోయిన్ విమానంలో పక్కపక్క సీట్లలోనే కూర్చున్నా హీరోయిన్ గుర్తుపట్టలేకపోయిందట. కనీసం పలకరించలేదట. 

shibhan babu కోసం చిత్ర ఫలితం


ఈ తమాషా ఇప్పటిది కాదు.. శోభన్ బాబు హీరోగా నటించిన దొరబాబు సినిమానాటి రోజులు. అందులో హీరోయిన్ గా ప్రియారామన్‌ను బుక్ చేశారు. ఆమె చెన్నై నుంచి కోయంబత్తూర్‌కు విమానంలో వెళ్లిందట. ఆ ఫ్లైట్ లోనే శోభన్ బాబు వస్తున్నారని సినిమా టీమ్ చెప్పిందట. 

shoban babu priya raman dorababu కోసం చిత్ర ఫలితం

శోభన్‌బాబుగారంటే మైండ్‌లో ఒక ఇమేజ్‌ ఉంటుంది కదా. అందుకే మేకప్ లేకుండా శోభన్ బాబు ఆమె పక్క సీట్లోనే కూర్చున్నా ప్రియారామన్ గుర్తుపట్టలేదట. ఎవరో పెద్దాయన అనుకుందట. పాపం.. శోభన్ బాబు ఒకటి, రెండు సార్లు ఆమెను చూసి నవ్వారట కూడా. కానీ ప్రియా పట్టించుకోలేదు.

shibhan babu కోసం చిత్ర ఫలితం

కోయంబత్తూరు రాగానే రెండు కార్లు వచ్చాయట. ఒక్కదాన్నే కదా! రెండు కార్లు ఎందుకు అనుకుందట ప్రియారామన్. ఇదే విషయం మేనేజర్‌ని అడిగితే.. అదేంటి బాబుగారు వచ్చారు కదా అని ఆయన్ను చూపించారట. అప్పుడు షాక్ అవ్వడం ప్రియా రామన్ వంతు అయ్యిందట. అదీ సంగతి. 



మరింత సమాచారం తెలుసుకోండి: