ఈ మద్య వస్తున్న చిత్రాలు కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు ప్రయోగాత్మకంగా తీస్తున్నారు. ఇలాంటి వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులని అలరిస్తున్న నటుడు శ్రీ విష్ణు. నీది నాదీ ఒకే కథ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న శ్రీ విష్ణు బ్రోచేవారెవరురా అనే చిత్రం చేస్తున్నాడు. మెంటల్ మదిలో వంటి చిత్రాన్ని తెరకెక్కించిన వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో 'బ్రోచేవారెవరురా' చిత్రం రూపొందిస్తున్నారు.
శ్రీవిష్ణు,నివేదా థామస్, సత్యదేవ్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధానమైన పాత్రలను పోషిస్తోన్న ఈ చిత్రం నుంచి తాజాగా టీజర్ ను విడుదల చేశారు. ఇందులో సన్నివేశాలు చిత్రం పై ఆసక్తిని కలిగిస్తున్నాయి. శ్రీ విష్ణు ఈ చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం ఖాయమని అంటున్నారు.
ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన ఈ టీజర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. మే నెలలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. శ్రీ విష్ణు తిప్పరామీసం అనే చిత్రం కూడా చేస్తున్నాడు. మన్యం ప్రొడక్షన్స్ బ్యానర్పై విజయ్ కుమార్ మన్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.