గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో నాగార్జున నటించిన మన్మధుడు సినిమా అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బీభత్సమైన కలెక్షన్లు రాబట్టింది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా సీక్వెల్ మొదలుపెట్టారు కింగ్ నాగార్జున. డైరెక్టర్  రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో మన్మధుడు రెండో భాగాన్ని స్టార్ట్ చేశారు.

Image result for nagarjuna rakul

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ విదేశాలలో చాలా శరవేగంగా జరుగుతుండగా..ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అదేమిటంటే ఈ సినిమాలో నాగార్జున పక్కన హీరోయిన్స్ గా నటిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ పై నాగార్జున సీరియస్ అయినట్లు వార్త చక్కర్లు కొడుతోంది. అసలు విషయంలోకి వెళితే ఈ సినిమా కోసం కాస్త చల్లబడ్డాక రకుల్ ప్రీత్ సింగ్ ని నాగార్జున చూసి..నా పక్కన ఇంత పీలగా ఉంటే ఎలా ఉంటుందనే విషయాన్ని దర్శకుడితో చెప్పినట్టు ఓ వార్త విస్తృతంగా ప్రచారం అవుతున్నది.

Image result for nagarjuna rakul

దాంతో సినిమాపై ఏదైనా ప్రభావం పడకుండా చూసేందుకు దర్శకుడు రంగంలోకి దిగాడు. నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ విషయంపై రాహుల్ రవీంద్రన్ ట్విట్టర్లో స్పందించారు. మా సినిమాకు సంబంధించిన వార్తలు వాస్తవానికి భిన్నంగా కనిపిస్తున్నాయి. రకుల్ ప్రీత్ సింగ్ పోర్చుగీస్‌లో షూటింగ్ మాతో షూటింగ్‌లోనే ఉంది. ఆమె అందంగా, ముద్దుగా ఉండటం చూసి మేమంత హ్యాపీగా ఉన్నాం అని రాహుల్ రవీంద్రన్ ట్వీట్ చేశారు. మొత్తం మీద ఈ సినిమా డైరెక్టర్ స్పందించడంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ఆగింది.



మరింత సమాచారం తెలుసుకోండి: