ప్రభాస్ ఈమధ్య కాలంలో చాలసినిమాల ఓపెనింగ్ ఫంక్షన్స్ కు అదేవిధంగా కొన్ని సినిమాల ఆడియో ఫంక్షన్స్ కు అతిధిగా వచ్చే అలవాటు చేసుకున్నాడు. 'బాహుబలి' తరువాత ప్రభాస్ నేషనల్ సెలెబ్రెటీగా మారిపోయిన పరిస్థుతులలో ప్రభాస్ తన ఇమేజ్ కి అనుగుణంగా కొత్త హీరోలను కొత్త హీరోయిన్స్ ను ప్రమోట్ చేస్తూ తన ఇండస్ట్రీలో పెద్ద స్థాయిని కొనసాగిస్తున్నాడు. 

ఇలాంటి పరిస్థుతులలో ప్రభాస్ ఈరోజు 'నువ్వు తోపురా' (ఎన్టీఆర్) మూవీ ట్రైలర్ ను లాంచ్ చేసాడు. యంగ్ హీరో సుధాకర్ కొమకుల హీరోగా నటిస్తున్న ఈమూవీలో నిత్యా శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. బాధ్యతలు అంటే ఇష్టపడని ఒక యువకుడు అమెరికాకు వెళ్లి అక్కడ అనుకోని పరిస్థుతులలో కొన్ని సమస్యలలో ఇరుక్కుని ఆతరువాత బాధ్యత తెలుసుకున్న వ్యక్తిగా మారిన కథను చాలా వెరైటీగా దర్శకుడు హరినాథ్ బాబు చిత్రీకరించినట్లు టాక్. 

అయితే ఈసినిమా కోసం యూనిట్ ను అంతా అమెరికాకు తీసుకు వెళ్లి ఏకంగా రెండు నెలలు షూటింగ్ అక్కడ షూట్ చేయడమే కాకుండా ఈమూవీ పై భారీగా ఖర్చు పెట్టడం ఇండస్ట్రీ  టాపిక్ గా మారింది. దీనితో ఈసినిమాలో ఏముంది అన్న విషయమై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి 

ఈమధ్య కాలంలో అంచనాలు లేకుండా విడుదలైన చాలా చిన్న సినిమాలు సక్సస్ అవుతున్న నేపథ్యంలో ఎన్టీఆర్ పేరుకు ఉండే క్రేజ్ తో ఈమూవీ కూడ హిట్ అవుతుందని నిర్మాతలు నమ్ముతున్నారు. ప్రభాస్ ఏదైనా ఒక సినిమాను ప్రమోట్ చేస్తే ఆ సినిమా సాధారణంగా హిట్ అవుతుంది అన్న ఇండస్ట్రీ సెంటిమెంట్ ఉంది. ఇప్పుడు కూడ అదే రిపీట్ అయితే యంగ్ హీరో సుధాకర్ కు మంచిరోజులు వచ్చినట్లే అనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: