తెలుగులో మాంచి మాస్ డైరెక్టర్ పేరు చెప్పమంటే మొదట చెప్పే పేరు వీవీ వినాయక్. ఆయన తీసిన మాస్ మూవీస్ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసాయి. యాక్షన్, సెంటిమెంట్, ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేసి తీయడంలో వినాయక్ వెరీ స్పెషల్. బీ సీ సెంటర్ల నాడి పట్టడంలో ఆయనకు ఆయనే సాటి. వినాయక్ మూవీస్ లో సాంగ్స్ కూడా సూపర్ అంటారు.


ఆయన తెలుగులో ఆల్మోస్ట్ అందరు టాప్ స్టార్స్ తో పనిచేశారు. చిరంజీవితో ఠాగూర్, ఈ మధ్యన మళ్ళీ ఖైదీ నంబర్ 150 వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ ఇచ్చారు. బాలక్రిష్ణతో చెన్నకేశవరెడ్డి వంటి పవర్ఫుల్ మూవీని తీశారు. ఎంటీయర్ తో ఆది సాంబ, అదుర్స్ ఇలా అన్నీ హిట్సే తీశారు. ఇక వెంకటేష్ తో లక్ష్మీ వంటి సూపెర్ హిట్ తీసిన వినాయక్ మాస్ మహరాజ్ రవితేజతో క్రిష్ణ తీసి తిరుగులేని హిట్ అనిపించారు.


అయితే ఇవన్నీ ఫ్లాష్ బ్యాక్. ఇపుడు వీవీ వినాయక్ ఓ విధంగా వెనక్కి వెళ్ళిపోయాడనే చెప్పాలి. ఆయన అఖిల్ మూవీ తరువాత మళ్లీ మరో సినిమా మొదలుపెట్టలేదు. ఆ మధ్యన బాలక్రిష్ణతో మూవీ అన్నారు. వెంకటేష్ తో సినిమా అని కూడా ప్రచారంలోకి వచ్చింది. రవితేజాతో చేస్తాడని, అదుర్స్ 2 జూనియర్ తో ఉంటుందని కూడా గట్టిగా వినిపించింది.


అయితే ఇపుడు మరో న్యూస్ వైరల్ అవుతోంది. వీవీ వినాయక్ ఏకంగా డైరెక్షన్ కే ప్యాకప్ చెప్పేసి రిటైర్ అవుతారని అంటున్నారు. మరి ఇది ఎంతవరకూ నిజమో తెలియదు కానీ అదే జరిగితే మాత్రం టాలీవుడ్ కి షాకింగ్ న్యూసే. సత్తా ఉన్న వినాయక్ మరో మంచి మాస్ హిట్ ఇచ్చి ప్రూవ్ చేసుకోవాలని అంతా కోరుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: