బ్లాక్ బస్టర్ సినిమాల నిర్మాతబండ్ల గణేష్ రాజకీయాలలో కూడా సంచలనాలు సృష్టించాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సందర్భంగా చాల ప్రయత్నాలు చేసాడు. అయితే రాజకీయాల దెబ్బకు తట్టుకోలేక రాజకీయాల నుండి తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించి కొద్ది రోజులు అవ్వకుండానే ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ భారీ నిర్మాత ప్రస్తుత రాజకీయాల పై అదేవిధంగా చిరంజీవి పవన్ ల వ్యవహార శైలిలో ఉన్న తేడాల పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. 

రాజకీయాలలో ఉన్న కుళ్ళును చిరంజీవి తట్టుకోలేరానీ అయితే తన బాస్ పవన్ కళ్యాణ్ ఎలాంటి కుళ్ళును అయినా తట్టుకుని భరిస్తాడనీ కామెంట్ చేసాడు. అంతేకాదు పరిస్తుతులను తట్టుకుని ఎదురీదడమే కాకుండా బరితెగించే విషయంలో పవన్ స్పీడ్ ముందు చిరంజీవి సరిపోడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు బండ్ల గణేష్.

అందువల్లనే ఈనాటి విలువలు లేని రాజకీయాలకు ఎట్టి పరిస్తుతులలోను చిరంజీవి సరిపోడనీ ఎప్పటికైనా పవన్ ‘ముఖ్యమంత్రి’ అయి తీరుతాడు అన్న నమ్మకం తనకు ఉంది అంటూ ఈ పవన్ భక్తుడు జోష్యం చెపుతున్నాడు. రాజకీయాలలో నిలబడాలి అంటే ‘శత్రువులను తయారు చేసుకోవడం మిత్రులను దూరం చేసుకోవడం’ అంటూ నేటి రాజకీయాలకు ఒక కొత్త అర్ధాన్ని బండ్ల గణేష్ వివరించాడు.

మంచి కథలు దొరికితే తిరిగి తాను సినిమాలు తీస్తాను అని చెపుతున్న ఈ సంచలన నిర్మాత త్వరలో ప్రారంభం కాబోతున్న మహేష్ అనీల్ రావిపూడి మూవీ ప్రాజెక్ట్ లో ‘ముద్దపప్పు’ స్వభావంతో ఉండే ఒక నిర్మాత పాత్రలో నటించబోతున్నాడు. ఈపాత్ర బండ్ల గణేష్ కు పూర్తిగా సరిపోతుంది అన్న ఉద్దేశ్యంతో అనీల్ రావిపూడి ఇతడి పాత్రను క్రియేట్ చేసినట్లు టాక్. సినిమాల నిర్మాణానికి దూరమై రాజకీయాల నుండి తప్పుకుని తిరిగి నటుడుగా తన రీ ఎంట్రీని ఇస్తున్న ఈ సంచలన నిర్మాత అదృష్టం ఎలా టర్న్ చేసుకుంటుందో చూడాలి..  
 


మరింత సమాచారం తెలుసుకోండి: