తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ఈ మద్య వరుస విజయాలతో దూసుకు వెళ్తున్న హీరో నాని.  ఆ మద్య నాని నటించిన జెంటిల్ మాన్, నిన్నుకోరి చిత్రాల్లో నటించి మంచి మార్కులు కొట్టేసింది.  ఎన్టీఆర్ తో జైలవకుశ చిత్రంలో కూడా నటించింది నివేదా థామస్. ఇటీవల తన పై చదువుల కోసం ఇండస్ట్రీకి కొంత దూరం ఉన్నా..ప్రస్తుతం ఆమె వరుస చిత్రాలతో బిజీగా మారిపోయింది.  ఈ నేపథ్యంలో రజనీకాంత్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో 'దర్బార్' చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తుంది.

ఈ మద్య  రజనీకాంత్ కి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ తరువాత ఈ చిత్రం షూటింగులో నయనతార జాయిన్ అయింది.  తాజాగా దర్భార్ షూటింగ్ లో నివేదా కూడా జాయిన్ అయినట్లు సమాచారం.  ఈ చిత్రంలో రజినీ కాంత్ కూతురుగా నటించబోతుందట నివేదా.  ఆ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉండటం వల్లనే నివేదా ఒప్పుకుందని అంటున్నారు. 

ఈ చిత్రంలో రజినీకాంత్ ద్విపాత్రాభియం చేస్తున్న విషయం తెలిసిందే.  ఇందులో ఒక పాత్ర పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా..మరో పాత్ర సామాజిక కార్యకర్తగా నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.  ఈ చిత్రంలో విలన్ గా  బాలీవుడ్ నటుడు ప్రతీక్ బబ్బర్ నటిస్తున్నాడు. వచ్చే ఏడాదిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: