తమిళంలో బ్లాక్ బస్టర్ సాధించిన "విక్రమ్ వేదా" సినిమా గురించి తెలిసిందే. విజయ సేతుపతి, మాధవన్ కలిసి నటించిన ఈ చిత్రం తమిళనాడులో మంచి విజయాన్ని సాధించింది. ఇక ఈ సినిమాని చాలాకాలంగా తెలుగులో రీమేక్ చేస్తున్నట్లు వార్తలొచ్చాయి, గతంలో విక్టరీ వెంకటేష్- రవితేజలు కలిసి నటిస్తున్నారన్న వార్తలొచ్చాయి, అయితే అవి నిజం కాలేదు.
ఇక తాజగా ఈ చిత్ర రీమేక్ పై మరోసారి వార్తలొచ్చాయి అయితే ఈసారి రవితేజ స్థానంలో నారా రోహిత్ , వెంకటేశ్ నటించనున్నట్లు కొంతకాలంగా వార్తలు వెలువడుతున్నాయి. అయితే వీటిలో నిజం లేదని వెంకటేశ్ సోదరుడు, ప్రముఖ నిర్మాత సురేశ్బాబు స్పష్టం చేశారు.
దీనిపై స్పందించిన సురేష్ బాబు ప్రస్తుతం వెంకటేశ్ కేవలం "వెంకీ మామ" సినిమాతో బిజీగా ఉన్నారని తెలిపారు. త్వరలో ఆయన కొత్త ప్రాజెక్ట్కు సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేస్తామని చిత్రవర్గాల ద్వారా వెల్లడించారు. దీంతో "విక్రమ్ వేదా" రీమేక్ ఇప్పట్లో లేనట్లుగానే తెలుస్తోంది.