ఇక్కడ మజిలీ, తమిళంలో సూపర్ డీలక్స్ సినిమాలతో 2019 లో ప్రథమార్థంలోనే భారీ హిట్స్ ని సొంతం చేసుకుంది. ఇదే హుషారుతో నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్న సినిమాలోను సమంత నటిస్తోంది. రీసెంట్‌గా యూ టర్న్ ఫ్లాప్ అయినప్పటికి ఆ ప్రభావం సమంత మీద ఏమాత్రం పడలేదు.  అందుకే నందినీ రెడ్డి సినిమాకు వెంటనే ఓకే చెప్పేసింది. అందుకు కారణం కూడా లేకపోలేదు. నందిని చెప్పిన కథ సమంతకు ఓ ఛాలెంజింగ్ రోల్ అనిపించడమే.


అంతేకాక ఈ సినిమా ఆల్‌రెడీ కొరియన్ భాషలో మంచి కమర్షియల్ సక్సస్ ను సొంతం చేసుకుంది. ఆ సినిమానే "మిస్ గ్రానీ". ఈ సినిమా సమంతకు విపరీతంగా నచ్చడంతో ఏమాత్రం ఆలోచించకుండా నందినికి డేట్స్ ఇచ్చేసింది. ఇక ఈ సినిమాలో సమంత తో పాటు యంగ్ హీరో నాగ శౌర్య, నట కిరీటి డా.రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, లక్ష్మీ.. తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇక సమంత రీసెంట్ హిట్ మజిలీ తర్వాత "ఓహ్ బేబీ" కి సంబంధించిన వార్త బయటకు వస్తుందనుకున్నారు. కానీ చిత్ర బృందం ఈ సినిమాకి సంబంధించిన అన్ని విషయాలను సీక్రెట్ గా ఉంచుతున్నారు. 


అయితే అక్కినేని అభిమానులు మాత్రం ఈ సినిమా న్యూస్ ఎప్పుడొస్తుందా అని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా అన్నీ కార్యక్రమాలు శరవేగంగా పూర్తి చేసుకుంటున్నాయట. అంతేకాదు దర్శకురాలు నందిని రెడ్డి కూడా ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించి గట్టి హిట్ కొట్టాలనే ప్రయత్నంలో ఉన్నారని లేటెస్ట్ అప్‌డేట్. ఇక ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, క్రాస్ పిక్చర్స్ పతాకాలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: