శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై అగ్ర నిర్మాతలు డా.కె.ఎల్.నారాయణ, ఎస్.గోపాల్ రెడ్డి కలిసి ఎన్నో విజయవంతమైన సినిమాలను నిర్మించారు. మంచి నిర్మాణ విలువలతో సూపర్ డూపర్ హిట్స్ ని తెలుగులోనే కాకా హిందీలోను నిర్మించి కమర్షియల్ సక్సస్ ను అందుకున్నారు. అంతేకాదు సినిమా నిర్మాణం విషయంలో మంచి అభిరుచి గల నిర్మాతలుగా సినీ పరిశ్రమలో ప్రత్యేకమైన గుర్తింపును పొందారు. నాగార్జున, వెంకటేష్, రవితేజ్, జగపతి బాబు వంటి స్టార్స్ తో నిర్మించిన సూపర్ హిట్ సినిమాలు దుర్గా ఆర్ట్స్ బ్యానర్ సొంతం అని చెప్పాలి. అయితే ఈ బ్యానర్‌పై గత కొంతకాలం గా సినిమాలను నిర్మిచడం ఆపేశారు. 


కానీ సూపర్ స్టార్ మహేష్, మెగా పవర్ స్టార్ రాం చరణ్, యంగ్ టైగర్ ఎన్.టీ.ఆర్ లతో సినిమాలను నిర్మించాలని, వీళ్ళతో నిర్మించబోయే దర్శకులను కూడా ఎంపిక చేసుకున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు గట్టిగానే వినిపించాయి. ముఖ్యంగా దర్శక ధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ కాంబినేషన్ లో.. మహేష్ 25వ సినిమా ఉంటుందని అనుకున్నారు. కానీ రక రకాల కారణాల వల్ల దుర్గా ఆర్ట్స్ బానర్‌పై నిర్మించే "మహేష్ 25"వ సినిమా ఫైనల్ కాలేదు. దాంతో మహేష్ 25వ సినిమాగా "మహర్షి" ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 


అయితే ఈ సారి మాత్రం పక్కా రాజమౌళి దర్శకత్వంలో మహేష్ నటించడం ఖాయం అనే మాట ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తోంది. ఎందుకంటే దుర్గా ఆర్ట్స్ అధినేతలు మహేష్ తో సినిమా నిర్మిస్తే అది ఖచ్చితంగా రాజమౌళి దర్శకత్వంలో అని చాలా స్ట్రాంగ్‌ గా ఫిక్సైయ్యారట. మరి ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు సెట్ అవుతుందో చూడాలి. ప్రస్తుతం రాజమౌళి రాం చరణ్, ఎన్.టీ.ఆర్ లతో "ఆర్.ఆర్.ఆర్" తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇక మహేష్ "ఎఫ్-2" తో ఫాం లో ఉన్న అనిల్ రావిపూడి తో తన నెక్స్ట్ సినిమా కమిటైయారు. అయితే "ఆర్.ఆర్.ఆర్" తర్వాత రాజమౌళి తెరకెక్కించబోయో సినిమా మహేష్ తోనే అని కూడా సమాచారం.  


మరింత సమాచారం తెలుసుకోండి: