ఈ మద్య కొంతమంది స్టార్ హీరో అభిమానులు చేస్తున్న అత్యుత్సాహంతో అటు హీరోలు, కుటుంబ సభ్యులు ఇబ్బందుల పాలు అవుతున్నారు.  ఆ మద్య ఓ హీరో వీరాభిమాని మరో హీరో అభిమానిని దారుణంగా పొడిచి చంపిన ఘటన ఎప్పటికీ మరువలేం.  అలాగే కొన్ని సార్లు హీరోల ఫ్లెక్సీ ల పై కూడా వివాదాలు రావడం కొట్టుకోవడం..పోలీస్ స్టేషన్ కి వెళ్లడం చూశాం.  మరి  కొంత మంది అభిమానుతు తమ అభిమాన హీరో పోస్టర్లు, ఫ్లెక్సీలు కట్టే సమయంలో కరెంట్ షాక్, అగ్ని ప్రమాదం సంబవించి చనిపోయారు. 

తాజాగా టాలీవుడ్ నటుడు మహేశ్ బాబు నటించిన మహర్షి సినిమా నేడు రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే.  ఈ సందర్భంగా సినిమా ఫ్లెక్సీ కడుతూ మహేశ్ అభిమాని ఒకరు మృతి చెందాడు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో జరిగింది. 

చిన్ననాటి నుంచి మహేష్ బాబు అంటే ఎంతో అభిమానించే మురళీకృష్ణ థియేటర్లో  నేడు ‘మహర్షి’రిలీజ్ సందర్భంగా  ఎర్రంశెట్టి రాజీవ్ (26) ఫ్లెక్సీ కడుతున్న సమయంలో పక్కన కరెంట్ తీగలు తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఆసుపత్రికి తరలించేలోగానే ప్రాణాలు కోల్పోయాడు.

సమాచారం అందుకున్న పోలీసులు థియేటర్ వద్దకు చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: