వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహర్షి’ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ మొదటి షో పడ్డ నాటినుండి సొంతం చేసుకుంది. దీంతో వేసవి కాలం మరియు సెలవుల అయిన నేపథ్యంలో మహర్షి సినిమా థియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడుతున్నాయి. సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో మహేష్ అభిమానులు సినిమా థియేటర్ దగ్గర హంగామా ఒక రేంజ్ లో చేస్తున్నారు. తమ అభిమాన నటుడు 25వ సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో ఒక రేంజ్ లో సినిమా థియేటర్ల దగ్గర పండగ చేసుకుంటున్నారు.

Image result for maharshi

ఇటువంటి క్రమంలో మహేష్ అభిమానులకు షాక్ ఇచ్చింది మహర్షి టీం. విషయంలోకి వెళితే సినిమా ధియేటర్ కి వెళ్ళినప్పుడు ప్రస్తుత రోజుల్లో చాలా మంది థియేటర్లలో సెల్ఫీలు దిగుతూ హడావిడి చేసే సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. అయితే ఇటువంటి ఫోటోలు మహర్షి సినిమా థియేటర్లలో తీయకుండా మొదటి రోజు నుండే నిషేధించింది సినిమా యూనిట్. ధియేటర్ లో ఏలాంటి ఫోటోలు కానీ లేక వీడియోలు తీయడం నిషేదించింది.

Image result for maharshi

ఈ సంఘటనలను నియంత్రించడానికి క ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. సినిమా పైరసీ జరగకుండా నియంత్రించేందుకు ఈ బృందాన్ని రూపొందించారు. ఒకవేళ ఆలా ఎవరైనా ఫోటోలు తీస్తే వారిపై చాలా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ సంఘటనతో మహేష్ అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఎవరూ కూడా సినిమా ధియేటర్లో జేబులో నుంచి ఫోన్ తీయలేకపోతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: