‘పోకిరి’ ‘టెంపర్’ లాంటి సూపర్ హిట్ సినిమాలను తీసిన పూరి జగన్నాథ్ పరిస్థితి పూర్తి అయోమయంలో పడిపోవడంతో ఇక చేసేది లేక తన ప్రియ స్నేహితురాలు ఛార్మీతో కలిసి సినిమాలు తీస్తున్నాడు పూరి జగన్నాథ్. అయితే ఇక్కడ కూడ అతడికి దురదృష్టం వెంటాడుతూ ఉండటం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.

టాప్ హీరోలు ఎవరు పూరి వైపు చూడని నేపధ్యంలో నీడియం రేంజ్ హీరో రామ్ తో పూరి ప్రస్తుతం ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాను తీస్తున్నాడు. ఈసినిమాకు సంబంధించి ఇంకా వర్క్ చాల ఉన్న నేపధ్యంలో ఈమూవీ బడ్జెట్ అవసరాల నిమిత్తం ఈమూవీని పూరి కొన్ని ఏరియాలకు అమ్మకానికి పెట్టినా బయ్యర్ల నుండి సరైన స్పందన రాకపోవడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. 

తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీ హక్కులను కనీసం 15 కోట్లకు అమ్మాలని పూరి ప్రయత్నిస్తున్నా ప్రస్తుతం పూరీకి ఉన్న నెగిటివ్ ట్రాక్ రికార్డ్ రీత్యా బయ్యర్లు విపరీతమైన బేరాలు ఆడుతూ 10 నుంచి 12 కోట్ల మధ్య మాత్రమే ఆఫర్లు ఇస్తున్నట్లు సమాచారం. దీనితో ఈమూవీకి ఎలా క్రేజ్ తెప్పించాలి అన్న విషయమై పూరి సతమతమైపోతున్నట్లు తెలుస్తోంది. 

దీనికితోడు పూరి తనకొడుకు ఆకాష్ ను హీరోగా పెట్టి తీసిన మూవీ భయంకరమైన ఫ్లాప్ గా మారడంతో ఆ నష్టాలు అన్నీ కూడ రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’ కు శాపంగా మారాయి అని అంటున్నారు. వరస పరాజయాల మధ్య రామ్ సతమతమైపోతున్న పరిస్థుతులలో ఈమూవీ మార్కెట్ అనుకున్న విధంగా జరగకపోతే ఈమూవీని జూలై నెలలో విడుదల చేయాలి అని భావిస్తున్న పూరీ ఆలోచనలకు బ్రేక్ పడే ఆస్కారం ఉంది అని అంటున్నారు..   


మరింత సమాచారం తెలుసుకోండి: