శ్రీదేవి చివరి సినిమా చైనాలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఆమె లీడ్ రోల్‌లో నటించిన ఆఖరి చిత్రం మామ్ తాజాగా చైనాలో విడుదలైంది. ఇండియాలో విజయవంతమైన ఈ సినిమా చైనాలోనూ మంచి వసూళ్లు దక్కించుకుంటోంది.


మామ్ సినిమాలో అన్యాయానికి గురైన తన కూతురి కోసం పోరాడే తల్లిపాత్రలో శ్రీదేవి అద్భుతంగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఆమె మరణం తర్వాత ఉత్తమ నటిగా జాతీయ  పురస్కారం కూడా వచ్చింది. శ్రీదేవి నటన అటు చైనా వాసులకు కూడా బాగా నచ్చింది. 

శుక్రవారం చైనాలో విడుదలైన మామ్‌కు మంచి ఆదరణ దక్కుతోందని రిపోర్ట్ వస్తున్నాయి. తొలిరోజే దాదాపు 12 కోట్లు వసూలు చేసిందట మామ్ సినిమా. ఈ విషయాన్ని ప్రమిఖ బాలీవుడ్‌ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 

శుక్రవారం మామ్ తో పాటు మరికొన్ని చైనా సినిమాలు కూడా విడదలయ్యాయి. ఆ రోజు విడుదలైన సినిమాల్లో మామ్ టాప్ ఫోర్ స్థానం దక్కించుకుంది. మొత్తానికి మామ్ సినిమా ద్వారా అపురూపనటి శ్రీదేవి నటనావైదుష్యం మరోసారి వార్తలకెక్కుతోంది. ఆమె అభిమానులకు ఆనందం పంచుతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: