సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ నుంచి ఎలాంటి చిన్న న్యూస్ బయటకు వచ్చినా అది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.  2పాయింట్ 0, పెట్ట సినిమాలతో హిట్ కొట్టిన సూపర్ స్టార్ ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో దర్బార్ సినిమా చేస్తున్నారు.  ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతున్నది.  25 సంవత్సరాల తరువాత రజిని తిరిగి పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నారు.  


చంద్రముఖి హీరోయిన్ నయనతార హీరోయిన్ గా చేస్తోంది.  పవర్ ఫుల్ కాప్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నది.  ఇంతకు ముందు అందిన సమాచారం ప్రకారం రజినీకాంత్ ఈ సినిమా తరువాత సినిమా చేయబోరని, పూర్తిగా రాజకీయాలకే తన టైమ్ ను స్పెండ్ చేయబోతున్నారని వార్తలు వచ్చాయి.  ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేలింది.  


రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నట్టు రెండేళ్ల క్రితమే ప్రకటించినా... ఇప్పటి వరకు పార్టీ పేరు అనౌన్స్ చేయలేదు.  రజిని మక్కల్ మంద్రం పేరుతో  ఓ ఫ్యాన్స్ అసోసియేషన్ నడుస్తోంది.  దానినే అందరు పార్టీ పేరుగా భావించారు.  అది కేవలం ఫ్యాన్స్ అసోసియేషన్ మాత్రమే అని తేలింది. 

ప్రసుతం జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని అనుకున్నా అది జరగలేదు.  
2021 లో తమిళనాడు శాసనసభకు ఎన్నికలు జరగబోతున్నాయి.  ఈ ఎన్నికల్లో రజినీకాంత్ పార్టీ పోటీ చేస్తుందని స్వయంగా రజిని ప్రకటించారు.  అప్పటి వరకు సినిమాలు చేస్తూనే ఉంటానని రజిని చెప్పడం విశేషం.  అంటే ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు రజినీకాంత్ సినిమాల్లో నటిస్తారన్నమాట.  బహుశా అందుకే రజిని సినిమాల విషయంలో స్పీడ్ పెంచాడు


మరింత సమాచారం తెలుసుకోండి: