'చిలసౌ' సినిమాతో దర్శకుడి గా మంచి పేరు తెచ్చుకున్న నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వలో అక్కినేని నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నసినిమా 'మన్మథుడు-2', అక్కినేని సమంత, కీర్తి సురేష్, అనుష్క ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మన్మథుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ కి సీక్వెల్ గా రాబోతున్న ఈ సినిమా కోసం అక్కినేని ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు.


ప్రస్తుతం విదేశాల్ల షూటింగ్ జరుగుతున్న సందర్బంగా చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో చేస్తున్న సందడితో సినిమాపై అందరిలో కూడా ఆసక్తి రేకెత్తుతోంది. ముందుగా అనుకున్న ప్రకారం ఈ సినిమాను దసరాకు విడుదల చేసే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇంకా ముందే ఈ సినిమాను విడుదల చేయబోతున్నారట.


ఆగస్టు లో సాహో విడుదల ఉన్న కారణంగా ఆ నెల మొత్తం విడుదల చేయడం ఏమాత్రం మంచిది కాదు. ఇక దసరాకు కూడా పెద్ద సినిమాలు ఉన్న కారణంగా అప్పుడు కూడా విడుదల చేయడం కరెక్ట్ కాదని భావిస్తున్నారట చిత్ర బృందం. అందుకే శరవేగంగా సినిమాను పూర్తి చేసి జులై చివర్లో సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు లేటెస్ట్ అప్‌డేట్.



మరింత సమాచారం తెలుసుకోండి: