తెలుగు ఇండస్ట్రీలో 80వ దశకంలో టాప్ హీరోయిన్లుగా చెలామణి అయిన హీరోయిన్లు వాణిశ్రీ, శారదలు స్టార్ హీరోలతో నటించి మెప్పించారు.  హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగిన తర్వాత వాణిశ్రీ, శారద పలు చిత్రాల్లో తల్లి, అత్త పాత్రల్లో కలసి నటించారు. శోభన్ బాబు సరసన నటించిన 'ఏవండీ ఆవిడ వచ్చింది' ఇప్పటికే ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరిస్తూనే ఉంటుంది. అయితే ఈ చిత్రం హిట్ కావడంతో వీరిద్దరితో ప్రముఖ దర్శకులు సాగర్  ' ఇద్దరు అత్తల ముద్దుల అల్లుడు' అనే చిత్రానికి ప్లాన్ చేశారట. 

కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా సాగర్ కి మంచి పేరు వుంది. ఎన్నో భారీ విజయాలు ఆయన ఖాతాలో వున్నాయి.  తాజాగా దర్శకులు సాగర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..ఆ చిత్రం ఆగిపోవడానికి ఆసక్తికర కారణాన్ని వివరించారు.  ఈ చిత్రం కోసం మొదట వాణిశ్రీని సంప్రదించా.. ఆమె వెంటనే ఓకే చెప్పింది.  ఆ తర్వాత శారద దగ్గరకు వెళ్లగా.. ఈ చిత్రంలో నటించాలని నాకూ ఉంది. కానీ వాణిశ్రీతో చేయడం నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది.

ముఖ్యంగా మా ఇద్దరి కాస్ట్యూమ్స్ విషయంలో విభేదాలు వస్తాయని అన్నారు.  అంతేకాదు షాట్ అని చెప్పగానే నేను వెంటనే రెడీ అవుతాను..కానీ వాణిశ్రీ ఆలస్యం చేస్తుందని ఆమెకు సర్ధుకు పోయే గుణం లేదని ఇలా ఎన్నో కారణాలు చెప్పింది.  దాంతో వీరిద్దరి మద్య ఈగో ఫీలింగ్స్ ఈ స్థాయిలో ఉన్నాయని నాకు అర్ధం అయ్యింది.  దాంతో ఆ ప్రాజెక్ట్ ఆపేశాం...ఆ తర్వాత టైటిల్ మాత్రం వేరకరికి ఇచ్చేశాం అని సాగర్ తెలిపారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: