టాలీవుడ్ లో స్టార్ దర్శకుడుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న దర్శకుడు పూరీ జగన్నాథ్.  అతి తక్కువ టైంలో ఎబ్భై సినిమాలు పూర్తి చేసిన దర్శకుడుగా, కమర్షియల్ చిత్రాలతో, టాలీవుడ్ లో సరికొత్త హీరోని పరిచయం చేసిన దర్శకుడుగా పూరీ జగన్నాథ్ తనదైన ముద్ర వేసారు. అయితే ఈ మధ్య కాలంలో పూరీ జగన్నాథ్ సినిమా స్టైల్ ఈ జెనరేషన్ కి అంతగా వర్క్ అవుట్ కావడం లేదు. పూరీ దర్శకత్వంలో తన కొడుకు హీరోగా వచ్చిన చివరి చిత్రం మెహబూబా కూడా చేదు ఫలితం మిగిల్చింది.


ఇక హీరో రామ్ కెరియర్ చూసుకుంటే ఎప్పుడో దశాబ్దం క్రితం దేవదాసు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కెరియర్ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోతున్నాడు అని చెప్పాలి. అతని కెరియర్ లో రెడీ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ ఇప్పటి వరకు మళ్ళీ పడలేదు. అతని సినిమాలు అన్ని కమర్షియల్ గా ఒకే అనిపించుకున్న ట్రెండ్ సెట్ చేసే స్థాయిలో ఒక్క సినిమా కూడా లేదనే చెప్పాలి. ఈ మధ్య కాలంలో వచ్చిన విజయ్ దేవరకొండ కూడా క్రేజీ హీరోగా మారిపోయాడు. రామ్ ఇప్పటికి సాలిడ్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాడు.


ఇదిలా ఉంటే వీరిద్దరి కాంబినేషన్ లో వీరిద్దరి కాంబినేషన్లో ఇస్మార్ట్ శంకర్ సినిమా ప్రస్తుతం తెరకెక్కుతుంది. ఈ సారి రెగ్యులర్ మాఫియా కథలకి దూరంగా కాస్తా  డిఫరెంట్ కంటెంట్ తో పూరీ ఈ సినిమాన్ని ట్రై చేస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాతో ఇద్దరికి సాలిడ్ సక్సెస్ కావాలి. ఈ నేపధ్యంలో ఈ సినిమాని చాలా కేర్ ఫుల్ గా పూరీ తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమా ట్రైలర్ ని రామ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 15న ట్రైలర్ రిలీజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అయితే ఈ సినిమా మీద ఎంత నమ్మకంతో తెరకెక్కిస్తున్న ఏదో ఒక మూల ఇద్దరిని భయపెడుతుంది అని చెప్పాలి. దానికి కారణం సినిమా హిట్ అయితే ఇద్దరు ఒకేసారి బౌన్స్ బ్యాక్ అవుతారు. లేదంటే టాలీవుడ్ లో ఇద్దరి రేంజ్ పడిపోవడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తుంది. ఈ నేపధ్యంలో సినిమా రిజల్ట్ విషయంలో కొంత టెన్షన్ గా ఉన్నట్లు తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: