జీరో తర్వాత నటి అనుష్క ఏ సినిమాని ఒప్పుకోలేదు. అందుకు కారణం ఆ సినిమాకి ఎక్కువ సమయం కేటాయించడం కోసం తను మిగతా సినిమాలకు సైన్ చెయ్యలేదని చెబుతోంది. 2018లో 'పారి', 'సూయీ ధాగా', 'జీరో' సినిమాలు చేశానని... ఈ మూడు చిత్రాలు విభిన్నమైనవని తెలిపింది. అన్ని పాత్రలు ఒకలా ఉండవని కొన్ని ప్రత్యేక పాత్రలు ఉంటాయి. విభిన్నమైన చిత్రాలను చేయాలంటే ఎంతో ప్రిపరేషన్ అవసరమని చెప్పింది. అందువల్ల వచ్చిన ఆఫర్లన్నింటీనీ తీసుకోలేవమని చెప్పింది.
ఓవైపు నటిగా ఉంటూనే నిర్మాతగా వ్యవహరిస్తున్నానని... ప్రస్తుతం ఒక సినిమాతో పాటు, స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ కోసం షోలను నిర్మిస్తున్నానని అనుష్క తెలిపింది. వీటికి కూడా సమయాన్ని కేటాయించాల్సి ఉందని చెప్పింది. తెర వెనుక తాను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని తెలిపింది. హీరోయిన్గానే కాకుండా వివిధ రంగాల్లో కూడా మంచి పట్టు సంపాదించాలన్నదే తన ధ్యేయం అంటోంది.