మహర్షి సినిమాకు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మహర్షి సినిమాను చూసిన అనంతరం ప్రశంసల జల్లు కురిపించారు. హీరో మహేష్ బాబు, వంశీ పైడిపల్లి, నిర్మాతలను అభినందిస్తున్నట్లు ఆయన ట్వీట్ ద్వారా తెలియజేశారు. 


మహర్షి చిత్రం గురించి ఆయన చేసిన ట్వీట్ లో ఇలా మెచ్చుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు మహర్షి చిత్రాన్ని చూడడం జరిగింది. గ్రామీణ ఇతివృత్తంతో, వ్యవసాయ పరిరక్షణను, అన్నదాతలకు అండగా నిలబడాల్సిన ఆవశ్యకతను తెలియజేసిన ప్రబోధాత్మక చిత్రం అని కొనియాడారు. 

మహర్షి ప్రతి ఒక్కరూ చూడదగిన మంచి సినిమా అన్నారు వెంకయ్య. గ్రామీణ ప్రజల సౌభాగ్యాన్ని, వ్యవసాయ ప్రాధాన్యతను గుర్తుకు తెచ్చిన చిత్రం మహర్షి. సహజమైన చక్కని నటన కనబరిచిన కథానాయకుడు శ్రీ మహేష్ బాబు, చక్కగా చిత్రీకరించిన దర్శకుడు శ్రీ వంశీ పైడిపల్లి, నిర్మాతలతో పాటు చిత్ర బృందానికి అభినందనలు తెలియజేస్తున్నాను అంటూ శుభాకాంక్షలు తెలిపారు. 

మహర్షి మహేష్ బాబు హీరోగా నటించిన 25వ చిత్రం. రిలీజైన మొదటి నుంచే పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. కలెక్షన్లలోనూ దూసుకుపోతోంది. రైతుల స్థితిగతులపై.. వారి సమస్యలపై తీసిన చిత్రం మహర్షి. 



మరింత సమాచారం తెలుసుకోండి: