మహేష్ బాబు మహర్షి సినిమా సూపర్ హిట్టైంది. ఈ సినిమా తరువాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. జూన్ సెకండ్ వీక్ లో సినిమా స్టార్ట్ అవుతుంది. జులై నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. సీనియర్ నటి లేడీ సూపర్ స్టార్ విజయ శాంతి ఈ సినిమా ఓ కీలక పాత్ర చేస్తోంది. సమాచారం ప్రకారం విజయశాంతి మహేష్ కు అత్తగా కనిపిస్తోంది. మరో సీనియర్ నటి హీరోయిన్ రమ్యకృష్ణ కూడా ఇందులో కీలక పాత్ర చేస్తుందట.
ఇదిలా ఉంటె, మహర్షి తరువాత మహేష్ తిరిగి తన పాత సెంటిమెంట్ ను ఫాలో కావాలని చూస్తున్నాడు. మహేష్ కెరీర్లో మూడు అక్షరాలా పేర్లున్న సినిమాలు చాలా వరకు విజయం సాధించాయి. మురారి నుంచి ఈ సెంటిమెంట్ మొదలైంది. ఒక్కడు, అతడు, పోకిరి, ఇప్పుడు మహర్షి ఇలా చాలా సినిమాలు మూడు అక్షరాలున్న పేర్లే. అప్పట్లో మహేష్ సినిమా టైటిల్ అంటే మూడే అక్షరాలు ఉంటాయని అనుకునేవారు. ఇటీవల కాలంలో ఆ సెంటిమెంట్ కొద్దిగా తప్పింది.
కానీ, మహేష్ ఇప్పుడు ఆ పాత సెంటిమెంట్ ఫాలో కావాలని చూస్తున్నాడు. అనిల్ రావిపూడి సినిమాకు మొదట సరిలేరు నీకెవ్వరూ అనే టైటిల్ అనుకున్నారు. ఇదే టైటిల్ ఫిక్స్ చేస్తున్నారని వార్తలు కూడా వచ్చాయి. ఇందులో ఎంతమేరకు నిజం ఉందొ తెలియదుగాని, ఫ్యాన్ మేడ్ పోస్టర్లు కూడా బయటకు వచ్చాయి.
మూడు అక్షరాలు ఉండే పేరును పెట్టాలని మహేష్ దర్శకుడు అనిల్ రావిపూడికి సూచించినట్టు తెలుస్తోంది. మరి అనిల్ ఎలాంటి పేరును సెట్ చేస్తాడో చూడాలి. దిల్ రాజు, అనిల్ సుంకరలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.