హాలీవుడ్ లో మొదలైన మీటూ ఉద్యమం బాలీవుడ్ పాకింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా.. నానా పటేకర్పై చేసిన లైంగిక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దాంతో ఆయన తన ఇమేజ్ దెబ్బతినేలా తనూ శ్రీ దత్తా లైంగిక ఆరోపణలు చేసిందని ఆవేదన చెందారు. ఆమెపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని అప్పట్లో చెప్పారు.
తాజాగా తనుశ్రీ దత్తా నటుడు నానా పటేకర్పై చేసిన లైంగిక ఆరోపణల కేసులో తమకు ఎలాంటి సాక్ష్యాలు దొరకలేదని ముంబయి పోలీసులు వెల్లడించారు. 2008లో ‘హార్న్ ఓకే ప్లీజ్’ అనే చిత్రంలో ఓ ప్రత్యేక గీతంలో నటిస్తున్నప్పుడు పటేకర్ తన చెయ్యి పట్టుకుని లాగి అసభ్యకరంగా ప్రవర్తించాడని తనుశ్రీ ఆరోపించారు.
ఎప్పుడైతే తనుశ్రీ దత్తా మీటూ ఉద్యమం అంటూ నానా పటేకర్ పై ఆరోపణలు చేసిందో వరుసగా సినీ నేపథ్యంలో ఉన్నవారు..ఇతర రంగాల్లో ఉన్న వారు గతంలో తమపై లైంగిక దాడులు జరిగాయని ఆరపణలు చేశారు. తనుశ్రీ ఇచ్చిన ఫిర్యాదు స్వీకరించిన ముంబాయి పోలీసులు..సినిమా చిత్రీకరణ సమయంలో ఉన్నవారిలో దాదాపు 15 మందిని పోలీసులు విచారించారు.
అయితే పదేళ్ల క్రితం జరిగిపోయిన విషయం కావడంతో ఎవ్వరికీ ఏమీ గుర్తులేదని చెప్పారట. దాంతో సాక్ష్యాలేవీ దొరక్కపోవడంతో విచారణ కొనసాగించడం కష్టమవుతోందని పేర్కొన్నారు. కానీ తనుశ్రీ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు..నాకు న్యాయం జరిగేలా చేయడానికి కొందరు ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. కానీ, వారికి బెదిరింపులు వస్తున్నాయి. నిందితుడికి ఎప్పటికైనా శిక్ష పడుతుందన్న నమ్మకం నాకు ఉందని అన్నారు.