కన్నడ స్టార్ యాష్ కధానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్  గా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా కెజిఎఫ్. కోలార్ గనుల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా దేశవ్యాప్తంగా ఎంతటి అద్భుత రికార్డులు సృష్టించింది అనే విషయం అందరికి తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు భారత దేశం గర్వించదగ్గ దర్శకుడు రాజమౌళి ప్రత్యేక అతిథిగా విచ్చేసి సినిమాపై మరియు నటుడు యాష్ పై పొగడ్తల జల్లు కురిపించారు. నిజానికి తాను సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలు చూశానని, వాటిని బట్టి చూస్తే ఈ సినిమాకు పాన్ ఇండియా అపీల్ ఉందని భావించి, సినిమాను కేవలం కన్నడకు మాత్రమే పరిమితం చేయకుండా మిగతా భాషల్లో కూడా విడుదల చేయాలనీ భావించినట్లు తెలిపారు. 


అయితే ఆ తరువాత ఆ సినిమా కన్నడతో పాటు పలు ఇతర భారతీయ భాషల్లోనూ విడుదలై అన్ని చోట్ల సూపర్ డూపర్ హిట్ సాధించింది. అయితే ఆ సినిమా విడుదల తరువాత బాలీవుడ్ వర్గాలు సైతం మరొక్కసారి రీజినల్ సినిమాల పవర్ ని చూసి ఎంతో షాకయ్యాయి. ఇక చాప్టర్ 1 సృష్టించిన ప్రభంజనంతో చాప్టర్ 2 ఎప్పుడు విడుదల అవుతుందా అని దేశవ్యాప్తంగా సినిమా ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన చాప్టర్ 2 లో కొందరు బాలీవుడ్ నటులు కూడా నటిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఇక నేడు ఈ సినిమాకు సంబంధించి బయటకు వచ్చిన ఒక వార్త సోషల్ మీడియా వేదికల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. అదేమిటంటే, కెజిఎఫ్ చాప్టర్ 2 సినిమాని ఏకంగా 100 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మిస్తున్నారని, రాబోయే రోజుల్లో ఆ బడ్జెట్ మరింత పెరగవచ్చని సమాచారం. 


సినిమా పై ఉన్న అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఎంతో అత్యున్నత సాంకేతిక విలువలతో సినిమాను తెరక్కిస్తోంది యూనిట్. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, కన్నడ సినిమా చరిత్రలో ఇప్పటివరకు ఆ ఏ సినిమాకు 100 కోట్ల ఖర్చు పెట్టింది లేదు. కాబట్టి ఆ విధంగా కన్నడ సినిమా చరిత్రలో అత్యంత భారీ ఖర్చుతో రూపొందుతున్న సినిమాగా ఈ కెజిఎఫ్ చాప్టర్ 2 అక్కడ సరికొత్త రికార్డును సృష్టించింది అని చెప్పాలి. ఇక రేపు చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదల తరువాత ఈ సినిమా ఎంతటి కలెక్షన్ల ప్రభంజనాన్ని సృష్టిస్తుందో తెలియాలంటే మాత్రం సినిమా విడుదల వరకు వేచి చూడవలసిందే.... 


మరింత సమాచారం తెలుసుకోండి: