ఆర్ ఎక్స్ 100 తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన పంజాబీ ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్. ఈ భామ మొదటి సినిమాతోనే అటు గ్లామర్ క్వీన్ గా మరో వైపు నటనతో టాలీవుడ్ ప్రేక్షకులని తనవైపుకి తిప్పుకుంది. ఎంత కాదనుకున్న ఆమె హస్కీ లుక్స్ తో కుర్రకారు మనసులకి గట్టిగా గాయం చేసిందని చెప్పాలి. ఇక ఈ భామకి ఆర్ ఎక్స్ 100 సినిమా ఎంతగా ప్లస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ సినిమా ఎఫెక్ట్ తో టాలీవుడ్ లో ఒక్కసారిగా ఈ భామ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ కేటగిరిలోకి వెళ్ళిపోవాలని ఎదురుచూస్తుంది. 


ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ భామ ఓ వైపు విక్టరీ వెంకటేష్ కి జోడీగా వెంకి మామా అనే సినిమాలో నటిస్తుంది. మరో వైపు మాస్ మహారాజ్ కి జోడీగా డిస్కో రాజా సినిమాలో మెయిన్ హీరోయిన్ గా చేస్తుంది. ఇక స్టార్ హీరోలతో రెండు సినిమాలు చేతిలో పెట్టుకొని మరో వైపు తన బోల్డ్ అందాలతో మరోసారి కుర్రకారుని రెచ్చగొట్టడానికి సి కళ్యాణ్ ప్రొడక్షన్ లో కొత్త దర్శకుడు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 


తాజాగా పాయల్ రాజ్ పుత్ గురించి టాలీవుడ్ లో మరో ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతుంది. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ, కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ఏప్రిల్ లో సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. ఇందులో విలన్ గా జగపతి బాబు మొదటి సారి ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. మరో వైపు ఈ సినిమాలో హీరోయిన్ ని ఫైనల్ చేసే ప్రయత్నంలో ఉన్న కెఎస్ రవికుమార్ కన్ను ఇప్పుడు పాయల్ రాజ్ పుత్ మీద పడిందని తెలుస్తుంది. బాలయ్యకి జోడీగా ఈ భామని రంగంలోకి దించాలని దర్శకుడు చూస్తున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: