ఇప్పటి వరకు మెగా కుటుంబం నుంచి వచ్చిన హీరోలు మంచి పొజీషన్లోనే ఉన్నారు.  ఎవరి టాలెంట్ తో వారు ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు.  బన్ని, చెర్రీ ల తర్వాత సాయి తేజ్, వరుణ్ తేజ్ లు హీరోలుగా వచ్చారు.  ఇద్దరూ మంచి సక్సెస్ తోనే సాగుతున్నారు.  మెగాబ్రదర్ తనయుడు వరుణ్ తేజ్ మొదటి సినిమా ముకుంద సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్నా రెండో సినిమా కంచె ఏకంగా జాతీయ అవార్డు అందుకుంది.


ఈ సినిమా తర్వాత ఫిదా, తొలిప్రేమ లాంటి హిట్ సినిమాలతో వరుస విజయాలు అందుకుంటున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో తమిళ రిమేక్ మూవీ ‘వాల్మీకి’లో నటిస్తున్నాడు. అయితే సక్సెస్ ఉన్న హీరోలు నిర్మాతలకు కల్పవృక్షం అంటారు.  ఇప్పుడు వరుణ్ తేజ్ కూడా దర్శక, నిర్మాతలకు వరంగా మారారు. ఇంకేముంది..దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని అనుకుంటున్నాడు ఈ మెగా ప్రిన్స్.  తన రెమ్యునేషన్ అమాంతం పెంచేసారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 


ఫిధా, తొలి ప్రేమ,ఎఫ్ 2 ఇలా వరస  హిట్స్  తో పూర్తి స్దాయి బిజీ అయ్యిపోయారు.   టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉన్న కుర్ర హీరోల్లో వరుణ్ తేజ ఒకరు గా మారారు. దాంతో తన రెమ్యూనరేషన్ కూడా పెంచినట్లు టాక్.  అప్పటి వరకూ మూడు కోట్లు మాత్రమే తీసుకునే వరుణ్ తేజ...తన డిమాండ్ ని గుర్తించి ఐదు కోట్లు చేసినట్లు తెలుస్తోంది.  


అయితే వరుణ్ తేజ్ తో సినిమాలు తీస్తే పెద్దగా నష్టాలు వచ్చిన సందర్భాలు ఎక్కడా లేకపోవడంతో ప్రొడ్యూసర్లు కూడా వెనకడగు వెయ్యటం లేదట.  ప్రస్తుతం వరుణ్ తేజ ఓ స్పోర్ట్స్ డ్రామాలోనూ, హరీష్ శంకర్ దర్శకత్వంలో వాల్మీకి చిత్రంలోనూ నటిస్తున్నారు. మరి ఈ సినిమాలు మంచి సక్సెస్ సాధిస్తే మరింత పెంచే అవకాశాలు కూడా లేకపోలేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: