వరస పరాజయాలతో సతమతమైపోతున్న అల్లు శిరీష్ ఈవారం విడుదల కాబోతున్న ఎబిసిడి మూవీ పై చాల ఆసలు పెట్టుకున్నాడు. దీనితో ఈసినిమాను ప్రమోట్ చేస్తూ అల్లు శిరీష్ అనేక ప్రముఖ ఛానల్స్ కు అదేవిధంగా పత్రికలకు వరస పెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. 

ఇలాంటి పరిస్థుతులలో ఈమూవీకి అనుకోకుండా ప్రీ రిలీజ్ పాజిటివ్ టాక్ ఏర్పడటమే కాకుండా ఈసినిమా టిక్కెట్లకు అడ్వాన్స్ బుకింగ్ చాల వేగంగా జరుగుతూ ఉండటం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. మలయాళంలో హిట్ టాక్ తెచ్చుకున్న ఈమూవీలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించాడు. 

ఈమూవీ మూల కథను మార్చకుండా తెలుగు నెటివిటీని దృష్టిలో పెట్టుకుని చాల మార్పులు చేర్పులు చేసినట్లు సమాచారం. అయితే ఈసినిమా కథ గతంలో వచ్చిన నాని ‘పిల్ల జమిందార్’ మూవీ కథను పోలి ఉన్న నేపధ్యంలో ఈమూవీ తెలుగు ప్రేక్షకులకు ఎంత వరకు కనెక్ట్ అవుతుంది అన్న సందేహాలు కొందరిలో ఉన్నాయి. 

అయితే ఈమధ్య కాలంలో వచ్చి విజయం సాధించిన ‘మజిలీ’ ‘జెర్సీ’ ‘మహర్షి’ సినిమాల కథలు అన్నీ సీరియస్ వాతావరణంతో నడవడంతో సగటు ప్రేక్షకుడు ఈమధ్య సినిమా హాలులో నవ్వడం మర్చిపోయాడు. ఇలాంటి పరిస్థుతులలో అవుట్ అండ్ అవుట్ కామెడీగా ప్రేక్షకులను నవ్వించడానికి వస్తున్న శిరీష్ తన లక్ష్యాన్ని చేరుకోగలిగితే ఈ అల్లువారి అబ్బాయి కోరుకున్న హిట్ దొరికే ఆస్కారం ఉంది. అయితే ఈమూవీ గురించి ఒక్క మాట కూడ అల్లు అర్జున్ మాట్లాడక పోవడంతో ఈమూవీ హిట్ టాక్ వచ్చిన తరువాత మాత్రమే అల్లు కాంపౌండ్ స్పందిస్తుందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: