ప్రస్తుతం బుల్లితెర పై తన యాంకరింగ్ తో మంచి పేరు సంపాదించి రోజురోజుకు మంచి క్రేజ్ తో దూసుకెళ్తున్న యాంకర్లలో అనసూయ ప్రధమ స్థానంలో నిలుస్తారు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. మొదట్లో కొన్ని టెలివిజన్ కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగా వ్యవహరించిన అనసూయకు ఇటీవల కొన్నేళ్ల క్రితం ఒక ప్రముఖ తెలుగు ఛానల్ లో ప్రారంభమైన జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా మంచి పేరు వచ్చిందని చెప్పాలి. ఇక ఆ షోకు విపరీతమైన ఆదరణ లభించడంతో పాటు అనసూయ కు కూడా క్రేజ్ పెరుగుతూ వచ్చింది. 


ఇక ఆ తరువాత అక్కడినుండి ఆమెను కొన్ని సినిమా అవకాశాలు కూడా వరించాయి. అయితే వాటిని అందిపుచ్చుకుని ప్రస్తుతం ఆమె టాలీవుడ్ పరిశ్రమలోనూ మంచి నటిగా దూసుకెళ్తున్నారు. అయితే ఎంత పేరు సంపాదించినప్పటికీ కూడా ఆమె జీవితంలో ఒక పెద్ద వెలితి మాత్రం ఉందని ఆమె ఇటీవల ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ చెప్పుకొచ్చారు. నిజానికి తనకు వ్యక్తిగతంగా, అలానే వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలు లేవని, తన భర్త భరద్వాజ్ తనను ఎంతో ప్రేమగా చూసుకుంటారని అన్నారు. అయితే తమకు ప్రస్తుతం ఇద్దరు మగబిడ్డలున్నారని, మొదటి కాన్పు సమయంలో ఆడబిడ్డ అనుకున్నాము కానీ మగా బిడ్డ పుట్టాడు, 


ఇక రెండవ కాన్పులోనూ మళ్ళి మగబిడ్డే పుట్టాడని, అయితే తమ ఇంట్లో ఒక ఆడ బిడ్డ ఉంటె బాగుండేదని, అయితే ఆ లోటు లేకుండా మరొక్కసారి తాను గర్భం దాలిస్తే తప్పకుండా ఆడబిడ్డకు జన్మనిస్తానని ఆమె అన్నారు. అంతేకాక తాను ఆడబిడ్డను కనడానికి ఎన్నిసార్లు అయినా తల్లిని కావడానికి సిద్ధమని అనసూయ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు. నిజానికి మేము ముగ్గురం అక్కచెల్లెళ్ళం, కాబట్టి మాకు ఒక అమ్మాయి ఉంటె బాగుండేదని, ఎంతైనా మీకు ఎంతమంది పిల్లలు అని ఎవరైనా అడిగినపుడు మగబిడ్డలతో పాటు ఒక ఆడబిడ్డ కూడా ఉందని చెప్పుకోవడంలో ఉండే ఆనందమే వేరని అనసూయ అన్నారు......!!



మరింత సమాచారం తెలుసుకోండి: