టీవీ షోస్ తో యాంకర్‌గా టాప్ పొజిషన్‌లో ప్రముఖ యాంకర్ రష్మీ గౌతం సినిమాలలోను తన సత్తా  చాటుకుంటూ దూసుకుపోతోంది. గుంటూరు టాకీస్, అంతకుమించి, చారుశీల, నెక్స్ట్ నువ్వే, రాణిగారి బంగళా వంటి సినిమాలతో  గ్లామరస్ రోల్ లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. లిప్ లాక్స్ , రొమాంటిక్ సీన్స్ తో వెండితెర మీద రెచ్చిపోయింది. ఫ్లాప్ లతో సంబంధం లేకుండా, హీరో ఎవరనే ఆలోచన లేకుండా హీరోయిన్ గా మంచి ఫాం లో ఉంది.


ఇక ప్రస్తుతం రష్మీ నటించిన కొత్త సినిమా ట్రైలర్ రిలీజైంది. గత చిత్రాలకు ఏమాత్రం తీసిపోకుండా ఈ సినిమాలో కూడా అద్భుతంగా నటించిందని ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. మొత్తానికి రష్మీకి సస్పెన్స్ థ్రిల్లర్స్ బాగానే కలిసొస్తునాయి. రష్మీకి కూడా ఈ సినిమాలలో నటించడం బాగా సౌకర్యంగాను ఉన్నట్టుంది. అందుకే దర్శక నిర్మాతలు కూడా ఇలాంటి సినిమాలకు రష్మీనే బెస్ట్ ఛాయిస్‌గా సెలెక్ట్ చేసుకుంటున్నారు.


 ఇక రష్మీ లేటెస్ట్ సినిమా శివరంజనీ. ఈ సినిమాలో రష్మీ మేయిన్ లీడ్ రోల్ చేస్తోంది. మర్డర్ మిస్టరీ బ్యాగ్డ్రాప్ లో తెరకెక్కించిన సినిమా అని రీసెంట్‌గా రిలీజైన ఈ సినిమా ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. నాగ ప్రభాకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కమెడియన్ ధన్ రాజ్ కీలక పాత్రలో నటించాడు.
  



మరింత సమాచారం తెలుసుకోండి: