ఈ మద్య కొంత మంది సెలబ్రెటీలు తమ అత్యుత్సాహంతో సోషల్ మీడియాలో అభాసు పాలవుతున్నారు.  జబర్ధస్త్ కామెడీ షోతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ధన్ రాజ్ ప్రస్తుతం వెండి తెరపై తన కామెడీతో కడుపుబ్బా నవ్విస్తున్నాడు.  ఆ మద్య బిగ్ బాస్ సీజన్ 1 లో ధన్ రాజ్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు.  గత నెల ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.  ఎన్నికల కంటే ముందు మూడు నెలల నుంచి పార్టీ నేతలు ప్రజల్లోకి వెళ్లి తమ ఉపన్యాసాలతో దంచి కొట్టారు. 


ఇక ఏపీ  ఎన్నికల్లో అందరూ కూడా చంద్రబాబు గెలుస్తాడా..? లేక జగనా..? అని చర్చించుకుంటున్నారు. మరో ఐదు రోజుల్లో ఫలితాలు రానున్న క్రమంలో ఏపీలో ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో సర్వేలు కానీ, రాజకీయ విశ్లేషకులు కానీ జనసేన పార్టీ ప్రస్థావన ఎక్కడా తీసుకు రాలేదు.  ఈ సమయంలో కమెడియన్ ధన్ రాజ్ మాత్రం పవన్ సీఎం అవుతాడని జోస్యం చెబుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. 


ఏపిలో ఎన్నికల గెలుపు విషయం గురించి చిన్నపాటి హెచ్చరికలే జారీ చేసినట్లు కనిపిస్తుంది.  ''బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. 23న తుఫానుగా మారి,  శ్రీకాకుళం, తూర్పు, పశ్చిమగోదావరి మీదుగా కుప్పంలో తీరం దాటనుంది. గంటకు 120-145 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయి. ఆ గాల్లో ఎవడైనా ఎగిరిపోతే మాకు ఏ సంబంధం లేదు. ప్రమాద హెచ్చరిక ముందుగానే జారీ చేశాం. తుఫానుకి "జనసేన శతఘ్ని" అని నామకరణం చేశారు'' అంటూ పరోక్షంగా పవన్ పార్టీకి 125 నుండి 140 సీట్లు వస్తాయని ధన్‌రాజ్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టాడు.


తాజాగా ధన్ రాజ్ చేసిన పోస్ట్ పై కామెడీ పంచ్ లు పడ్డాయి. నీ అభిమానం తగలెయ్యా..ఎన్ని సీట్లు ఉంటాయో తెలియదు..అన్ని సీట్లు నువ్వే దగ్గరుండి గెలిపిస్తావా నాయనా..అసలు ఏపీలో ఎన్ని అసెంబ్లీ సీట్లు ఉంటాయో తెలుసా అంటూ సెటైర్లు వేస్తున్నారు. అయితే కొంత మంది మాత్రం ధన్ రాజ్ తాపత్రయానికి తెగ మెచ్చుకుంటున్నారు.  కాకపోతే నెటిజన్ల నుంచి విమర్శలు రావడంతో ధన్ రాజ్ ఆ పోస్ట్ డిలీట్ చేశారు. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: