సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటించిన మహర్షి సినిమ ఇటీవలే రిలీజ్ అయ్యి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. రివ్యూవర్లు, ప్రేక్షకుల నుంచి టాక్ ఎలా ఉన్నా వసూళ్ల పరంగా మత్రం మహర్షి బాక్స్ ఆఫీస్ వద్ద విజృంభిస్తున్నాడు. మహేష్ నటన, వంశీ పైడిపల్లి ఎంచుకున్న మెయిన్ స్టోరీ లైన్, వీకెండ్ వ్యవసాయం లాంటి అంశాలు ఈ సినిమాను బాక్స్ ఆఫీస్ దగ్గర నిలబెట్టాయి. ఫస్ట్ వీకెండ్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 100 కోట్ల గ్రాస్ వసూళ్లతో పాటు రూ. 65 కోట్ల షేర్ కొల్లగొట్టిన మహర్షికి రెండో వారం నుంచి బాక్స్ ఆఫీస్ వద్ద అసలు సిసలైన పరిక్ష ఎదురుకానుంది. ప్రస్తుతం మహర్షి సినిమా సక్సెస్ను బాగా ఎంజాయ్ చేస్తున్న మహేష్ ఈ సినిమా ప్రమోషన్లలో జోరు చూపిస్తున్నారు. ప్రమోషన్లు ముగిసిన వెంటనే ఫ్యామిలీతో సహా విదేశాలకు చెక్కేసి ఎంజాయ్ చెయ్యబోతున్నారు.
మహేష్ విదేశీ టూర్ నుంచి వచ్చిన వెంటనే ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యాన్ర్పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కే తన 26వ ప్రాజెక్ట్ షూటింగ్లో బిజీ కానున్నాడు. జూన్ నుంచి ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కనుంది. ఈ సినిమా ముగిసిన వెంటనే మహేష్ 27వ ప్రాజెక్ట్కు సైతం అదిరిపోయే స్టోరీ లైన్ రెడీ అయినట్టు తెలుస్తోంది. ఫ్యామిలీ సినిమాల దర్శకుడిగా మంచి పేరున్న యువ దర్శకుడు పరశురాం అదిరిపోయే స్టోరీ లైన్ రెడీ చేసి మహేష్కి ఫైనల్ ట్రాక్ను త్వరలోనే వినిపించనున్నట్టు తెలుస్తోంది.ఈ సినిమా స్టోరీ లైన్ ఎలా ఉండబోతుందో తాజా ఇండస్ట్రీ ఇన్నర్ సైట్లో ఓ టాక్ వైరల్ అవుతోంది.
ప్రసుత్తం మన దేశంలో తీవ్రంగా నలుగుతున్న ఓ సమస్యను ఈ సినిమాలో చూపిస్తున్నారట. మంచి సోషల్ మెసేజ్ ఉన్న కాన్సెప్ట్ను దర్శకుడు పరశురాం రెడీ చేశారట. గంలో టాప్ డైరెక్టర్ శంకర్ సోషల్ మెసేజ్ ఉన్న లైన్కు కమర్షియల్ టచ్ యాడ్ చేసి ఎలా హిట్లు కొట్టారో ఇప్పుడు పరశురాం సైతం మహేష్ కోసం అలాంటి స్క్రిప్ట్ రెడీ చేసినట్టు తెలుస్తోంది. సోషల్ మెసేజ్ ఉన్న కాన్సెప్ట్ అయినా కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కడా మిస్ కాకుండా పరశురాం ప్లాన్ చేసుకున్నాడట. ఇక మహేష్ 26వ ప్రాజెక్ట్ ఎలాగో ఎఫ్2 తరహాలో పూర్తిగా కామెడీ నేపథ్యంలోనే ఉండనుంది.
ఇక మహేష్ వరుసగా శ్రీమంతుడు, స్పైడర్, భరత్ అను నేను సినిమాలతో సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలే చేస్తున్నాడు. ఇప్పడు అనిల్ రావిపూడి సినిమాకు మాత్రం కామెడీ జాన్ర్ ఎంచుకుని మళ్లీ వెంటనే పరశురాం సినిమాతో తన పాత ఫార్మెట్కే వెళ్లిపోతున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్పై అగ్ర నిర్మాత అల్లు అరవింద్ భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ ఏడాది ద్వితీయార్థం నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.