వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన మహర్షి సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో తాజాగా ఈ సినిమా సక్సెస్ ఫంక్షన్ విజయవాడ నగరంలో చాలా గ్రాండ్గా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ ఫంక్షన్ కి సినిమా యూనిట్ మొత్తం హాజరయ్యారు. అంతేకాకుండా చిత్ర పరిశ్రమకు చెందిన పెద్దలు మరియు డైరెక్టర్ రాఘవేంద్రరావు  ముఖ్య అతిథిగా ఈ సక్సెస్ మీట్ కు హాజరయ్యారు.


ఈ సందర్భంగా రాఘవేంద్ర రావు మాట్లాడుతూ..వంద చిత్రాలు చేసినప్పుడు నాకు ఎంత సంతోషం కలిగిందో.. మహేష్ బాబు 25 చిత్రాలు పూర్తి చేసినప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారికి ఎంత సంతోషం కలిగి ఉంటుందో.. ఇప్పుడు నిన్ను చూస్తుంటే నాకు అంత సంతోషంగా ఉందని రాఘవేంద్ర రావు మహేష్ ని ఉద్దేశించి తెలిపాడు. రాఘవేంద్రరావు ఈ మాట చెప్పగానే మహేష్ బాబు లేచి నిలబడి చప్పట్లు కొట్టాడు.


డైరెక్టర్ వంశీ పైడిపల్లి సినిమాలో రైతుల గురించి వారి బాధలు గురించి చూపించిన సన్నివేశాలు చాలా బాగున్నాయి అని వంశీ డైరక్షన్ అదిరిపోయింది అంటూ రాఘవేంద్ర రావు మాట్లాడుతూ మే 9వ తారీఖున అప్పట్లో జగదేకవీరుడు అతిలోకసుందరి మొన్న మహానటి సినిమా తాజాగా మహర్షి సినిమా విడుదల అయ్యి అద్భుతమైన విజయాలు సాధించాయని రాఘవేంద్ర రావు పేర్కొన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: