అనీల్ రావిపూడితో సినిమాను ఇంకా మొదలు పెట్టకుండానే మహేష్ పరుశు రామ్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అని వార్తలు రావడంతో అంత గొప్ప కథ పరుశు రామ్ మహేష్ కు ఏమిచెప్పి ఒప్పించాడు అన్న విషయమై ఆసక్తికర చర్చలు ఇండస్ట్రీ వర్గాలలో జరుగుతున్నాయి. అయితే పరుశు రామ్ మహేష్ కోసం ఆలోచించిన కథలో రియల్ విలన్ బ్యాంకులకు వేల కోట్లలో ఎగనామం పెట్టి ప్రస్తుతం లండన్ లో విలాసవంతమైన జీవితం గడుపుతున్న విజయ్ మాల్య నిజ జీవితం అంటూ వార్తలు వస్తున్నాయి. 

తెలుస్తున్న సమాచరం మేరకు ఈకథలో మహేష్ తల్లి ఒక ప్రముఖ బ్యాంక్ లో పనిచేసే ఉన్నత అధికారిణి. అయితే ఆమెకు తెలియకుండా ఆమెను మబ్బులో పెట్టి ఒక బడా పారిశ్రామిక వేత్త ఆ బ్యాంక్ నుండి వేల కోట్లు ఋణంగా తీసుకుని నెమ్మదిగా విదేశాలకు వెళ్ళిపోతాడు. ఆనింద అంతా మహేష్ తల్లి పాత్రకు చుట్టుకోకవడంతో ఆమెను రక్షించు కోవడానికి మహేష్ రంగంలోకి దిగుతాడని తెలుస్తోంది.

అంతేకాదు విజయ్ మాల్య గెటప్ లో ఆ విలన్ పాత్ర కనిపించడంతో సామాన్య ప్రేక్షకులకు కూడ ఆ విలన్ పాత్ర సులువుగా కనెక్ట్ అయ్యేలా పరుశు రామ్ డిజైన్ చేసినట్లు టాక్. ప్రస్తుత కాలంలో చాలమంది బడా పారిశ్రామిక వేత్తలు బ్యాంక్ లను మోసం చేయడం ఒక పనిగా పెట్టుకున్న నేపధ్యంలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన ఈవిషయాలను సినిమాగా తీస్తే జనం ఈజీగా కనెక్ట్ అవుతారు అని పరుశు రామ్ ఆలోచన అని అంటున్నారు. 

అయితే ఈకథ మహేష్ కు బాగా నచ్చినా ఈకథను ఎంతవరకు స్క్రీన్ ప్లేగా పరుశు రామ్ మార్చగాలుగుతాడు అన్న విషయం పై మహేష్ ఫైనల్ నిర్ణయం ఉంటుంది అని వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ‘మజిలీ’ సినిమాను తీసిన శివ నిర్వాణ కూడ మహేష్ కు ఒక కథ చెప్పినట్లు వార్తలు వస్తున్న పరిస్థుతులలో వచ్చే ఏడాది ఎంతమంది దర్శకుల సినిమాలలో మహేష్ నటిస్తాడు అంటూ ఇండస్ట్రీ వర్గాలలో జోక్స్ పడుతున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: