మేఘా ఆకాష్... లై సినిమాతో వెండి తెరకు పరిచయమైన భామ. హాను రాఘవపూడి దర్శకత్వంలో నితన్ కథానాయకుడిగా ఈ చిత్రం రూపొందింది. సినిమా ఘన విజయాన్ని సాధించటంతో మరళ నితిన్ తన తదుపర చిత్రంలో అవకాశం కల్పించాడు. ఈ సారి కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఛల్ మోహాన్ రంగా 2018లో విడుదల చేశారు. ఈ చిత్రం మిశ్రమ ఫలితాలు అందుకోవడంతో పాటు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపించలేకపోయింది. దీంతో అమ్మడికి తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. 


చిన్నగా బాలీవుడ్ తెరమీదకు వెళ్లి అక్కడ తన అదృష్టాన్ని పరిక్షించుకుంది. దాదాపు ఆరు చిత్రాలలో నటించిన ఈ భామ ఇప్పటికే నాలుగు చిత్రాలు విడుదల కాగా మరో రెండు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి అవకాశం కల్పించింది.


ఈ సారి అమ్మడికి బంపర్ ఛాన్స్ తగిలింది. రెండు తెలుగు చిత్రాల్లో నటించి.. టాలీవుడ్‌కు కొంతకాలంగా దూరమైన ఈ అమ్మడు తాజాగా 'మనుచరిత్ర' అనే సినిమాలో నటించేందుకు అవకాశం దక్కింది. ఇందులో హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఓ కీలక పాత్ర పోషించనున్నట్టు తెలుస్తోంది. నిర్మాత రాజ్ కందుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆయన కుమారుడు శివకందుకూరి హీరో రోల్ లో మెప్పించనున్నాడట. ఇటీవల ఈ ఫిల్మ్ లాంచ్‌కి కాజల్ చీఫ్ గెస్టుగా హాజరయ్యింది. పి.భరత్ కుమార్ అనే దర్శకుడ్ని మేకర్స్ ఈ సినిమా ద్వారా పరిచయం చేయనున్నారు. కాజల్ మేనేజర్ రాన్సన్ ' మనుచరిత్ర' మూవీకి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: