టాలీవుడ్లో మెగా హీరోలు ఓ క్రికెట్ జట్టు మాదిరిగా ఉన్నారు. మెగా హీరోల్లో మెగా స్టార్ చిరంజీవి, పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ తర్వాత ఈ తరం జనరేషన్ హీరోల్లో రాంచరణ్ తేజ్, అల్లు అర్జున్ స్టార్డమ్ అందుకుని టాలీవుడ్ యంగ్ జనరేషన్ హీరోలుగా దూసుకుపోతున్నారు. ఈ ఇద్దరు హీరోల మధ్య మెగా హీరోల్లో నెంబర్ 1 ర్యాంక్ కోసం ఏర్పడిన ఇగో కాస్త వీరి మధ్య వైరానికి కారణం అయినట్టు సోషల్ మీడియాలో గత రెండు మూడేళ్లుగా పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. ఈ పుకారులకు తగ్గట్టుగానే వారు వ్యవహరించిన కొన్ని సంఘటనలు వాటికి బలాన్ని చేకూర్చేలా ఉండడంతో ఈ ఇద్దరు మెగా హీరోల మధ్య అహం అనే వైరం ఉందన్న గుసగుసలు వినిపించాయి.
రామ్చరణ్ రంగస్థలం సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు క్రియేట్ చేసింది. నాన్ బాహుబలి సినిమాల్లో రంగస్థలంతే రికార్డు. ఆ సినిమాతో రామ్చరణ్ కెరీర్ ఎక్కడికో వెళ్లిపోయింది. టాలీవుడ్లో ఎంతో మంది స్టార్ హీరోలు సైతం సిగ్గుతో తలవంచుకునేంత గొప్పగా విజయం సాధించింది. ఈ సినిమాపై ఇండస్ట్రీలో ఎంతోమంది.. ఇంకా చెప్పాలంటే ప్రతి ఒక్కరు గొప్పగా స్పందించడంతో పాటు రామ్చరణ్ నటనకు ఫిదా అయిపోయారు. ఆ సినిమాపై అల్లు అర్జున్ స్పందించకపోవడంతో తనకు చెర్రీ పోటీ వస్తున్నాడని అల్లు అర్జున్ ఫీల్ అయ్యాడన్న గుసగుసలు వచ్చాయి.
తాజాగా ఈ ఇద్దరు మెగా హీరోల వార్పై అల్లు శిరీష్ స్పందించాడు. ఏబీసీడీ ప్రమోషన్లో మాట్లాడుతూ వారిద్దరు చిన్నప్పటి నుంచే కలిసి చదువుకున్నారని... వీరు ఎప్పుడూ ఈగోలతో లేదరన్న శిరీష్... మెగా హీరోలందరూ ఒక్కటే అని.. పవన్ గారికి మా మద్దతు ఎప్పుడూ ఉంటుందని... ఎన్నికల ప్రచారంలో అల్లు అర్జున్ స్వయంగా ప్రచారానికి వెళ్లి నాగబాబు గారికి, పవన్ గారికి మద్దతు తెలిపినట్టు గుర్తు చేశాడు. ఇక కొందరు మెగా హీరోల మధ్య గొడవలు అంటూ యూట్యూబ్ వ్యూస్ కోసమే లేనిపోని వార్తలు క్రియేట్ చేస్తారని పంచ్ ఇచ్చాడు. మరి శిరీష్ క్లారిటీతో అయినా మెగా హీరోల వైరం వార్తలకు ఫుల్ స్టాప్ పడుతుందేమో ? చూడాలి.