కిషోర్ తిరుమల రామ్ కాంబినేషన్ లో వచ్చిన 'నేను శైలజ' తో ఎన్నో సంవత్సరాల తర్వాత రామ్‌ కి ఒక బ్లాక్ బస్టర్ హిట్ ని ఇచ్చాడు డైరెక్టర్ కిషోర్ తిరుమల. ఆ తర్వాత వీళ్ళిద్దరి కాంబినేష లోనే 'ఉన్నది ఒకటే జిందగీ' తెరకెక్కి యావరేజ్ గా ఆడింది. అయితే ఈ సారి మళ్ళీ వీళ్ళిద్దరు హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నారని లేటేస్ట్ అప్డేట్.  ప్రస్తుతం పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో 'ఇస్మార్ట్‌ శంకర్‌' సినిమాలో నటిస్తున్న ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ తరువాత చేయబోయే సినిమాను కూడా ఫైనల్‌ చేసినట్టుగా తెలుస్తోంది. 


'ఇస్మార్ట్‌ శంకర్‌' తరువాత ఓ రీమేక్‌ సినిమా చేసేందుకు రామ్‌ ఓకె చెప్పాడట. తమిళ్‌లో ఘనవిజయం సాధించిన 'థడం' సినిమాను తెలుగులో రీమేక్‌ చేసేందుకు రెడీ అవుతున్నాడు. తమిళంలో సూపర్ హిట్టందుకున్న సినిమా కథ హీరో కి బాగా నచ్చిందట. అందుకే ఈ సినిమా చేయాలని డిసైడయ్యాడని ఇండస్ట్రీ టాక్. 


అరుణ్‌ విజయ్‌ హీరోగా తెరకెక్కిన ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ రీమేక్‌ రైట్స్‌ ఇప్పటికే స్రవంతి మూవీస్‌ అధినేత స్రవంతి రవికిశోర్‌ సొంతం చేసుకున్నారు. ఈ సినిమాను గతంలో రామ్‌ హీరోగా 'నేను శైలజ', 'ఉన్నది ఒకటే జిందగీ' చిత్రాలకు దర్శకత్వం వహించిన కిశోర్‌ తిరుమల డైరెక్ట్ చేయనున్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ప్రాజెక్ట్‌పై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: