మాస్ హీరో గోపీచంద్ గత కొంతకాలంగా సరైన హిట్ లేక తెగ బాధ పడుతున్నాడు. ఒకప్పుడు వరుసగా సక్సస్ లను అందుకున్న గోపి కథల విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేక ఫ్లాప్ లను చూశాడు. దానికి తోడు విజయ్ దేవరకొండ, శర్వానంద్, నితిన్ వంటి యంగ్ హీరొస్ కాంపిటీషన్ కూడా గట్టిగానే ఉంది. అందుకే ఈ మధ్య గోపి కాస్త వెనకబడిపోయాడు. అయితే లేటెస్ట్  గా రెండు సినిమాలను కమిటయ్యి షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. ఈ మధ్యే షూటింగ్ లో చిన్న గాయమైన గోపీ తిరిగి సెట్ లో అడుగు పెట్టబోతున్నాడు.


గోపీచంద్‌ హీరోగా తిరు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మెహరీన్, జరీన్‌ఖాన్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్‌ షూటింగ్ ఆ మధ్య రాజస్తాన్‌లో జరిగిన సంగతి తెలిసిందే. అక్కడ ఓ యాక్షన్‌ సీన్‌లో భాగంగా గోపీచంద్‌ గాయపడటంతో ఈ సినిమాకు బ్రేక్‌ పడింది.


అయితే రీసెంట్‌గా ఈ సినిమా నెక్ట్స్‌ షెడ్యూల్‌ వచ్చే నెల 6న హైదరాబాద్‌లో స్టార్ట్‌ మొదలవబోతోందట.ఈ షెడ్యూల్‌లో గోపీచంద్ రేంజ్ కి తగ్గట్టుగా యాక్షన్‌ సన్నివేశాలను ప్లాన్‌ చేశారని సమాచారం. ఇక ఈ సినిమాతో పాటు బిన్ను సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో గోపీచంద్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాను బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించనున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: