సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 25వ సినిమా మహర్షి ప్రస్తుతం మంచి కలెక్షన్లతో తెలుగు రాష్ట్రాల్లో తన ప్రభంజనంతో దూసుకెళుతోంది. నిజానికి మొదటి రోజు కాస్త మిక్స్డ్ టాక్ సంపాదించిన ఈ సినిమా, మెల్లగా ప్రేక్షకుల నుండి మంచి టాక్ తో సూపర్ హిట్ ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా చాలా చోట్ల నాన్ బాహుబలి రికార్డులు, ఇంకొన్ని చోట్ల మహేష్ బాబు కెరీర్ లో బెస్ట్ ఫిలిం గా రికార్డులు బద్దలు కొడుతోంది. నిజానికి ఈ సినిమా కథ విన్నప్పుడే తనకు ఇది పోకిరీకి డబుల్ కలెక్ట్ చేస్తుందని అర్ధమయిందని సూపర్ స్టార్ మహేష్, మొన్నటి మహర్షి విజయోత్సవ సభలో చెప్పకనే చెప్పారు. 

ఇకపోతే ఈ సినిమాకు ఇప్పటికే చాలా మంది సినిమా మరియు రాజకీయ ప్రముఖుల నుండి మంచి ప్రశంశలు ఆడుతున్న నేపథ్యంలో మహేష్ బాబు, నేడు ట్విట్టర్ వేదికగా ఈ సినిమాకు సంబంధించి తనకు లభించిన అతి పెద్ద కాంప్లిమెంట్ గురించి చెప్పుకొచ్చారు. నిజానికి ఆయన వద్దకు సినిమా కథ చెప్పడానికి దర్శకుడు వంశీ వచ్చి, కథను వినిపించినపుడు, చివర్లో ఒక మాట అన్నారని, సర్ మీరు తప్ప ఈ క్యారెక్టర్ మరొకరు చేయలేరు, ఇటువంటి రోల్ లో మీరు మాత్రమే పూర్తి న్యాయం చేయగలరు అని చెప్పిన మాట తాను ఎప్పటికీ మర్చిపోలేనని, వంశీకి ట్విట్టర్ ద్వారా ఓక పోస్ట్ చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. 

అయితే దానికి స్పందించిన దర్శకుడు వంశీ, మీ వంటి గొప్ప సూపర్ స్టార్ తో సినిమా తీయడం తన అదృష్టమని, మీరు నా కథను ఒప్పుకుని సినిమా చేసారు, కేవలం మీరు చేయడం వల్లనే మహర్షి ప్రస్తుతం  ఇంతటి అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది అంటూ రిప్లై ఇచ్చారు. ఈ విధంగా మహర్షి సినిమా మహేష్ బాబుకు కెరీర్ పరంగా ఎన్నో మెమొరబుల్ మూమెంట్స్ ను ఆయనకు మిగిల్చింది అని చప్పవచ్చు. ఇక ఈ సినిమా అద్భుత విజయంతో మహేష్ తదుపరి చేయబోయే అనిల్ రావిపూడి సినిమాపై అంచనాలు ప్రస్తుతం తారాస్థాయికి చేరాయి.....!!! 


మరింత సమాచారం తెలుసుకోండి: