స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే వీరిద్ద‌రి కాంబోలో జులాయి, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి సినిమాలు తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే.  ఈ రెండు సినిమాలు ప్రేక్ష‌కుల అంచ‌నాలు అందుకున్నాయి. ఇక మూడోసారి వీరిద్ద‌రి కాంబినేష‌న్ రిపీట్ అవుతుండ‌డంతో వీరి కాంబోలో హ్యాట్రిక్ ఖాయ‌మ‌న్న అంచ‌నాలు ఉన్నాయి.


ఈ సినిమాకు `పార్థు`, `నాన్న నేను` స‌హా ప‌లు పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఇప్ప‌టికే తొలి షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా రెండో షెడ్యూల్ త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌నుంది. పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాలో రెండో హీరోయిన్‌ను కూడా తీసుకోనున్న‌ట్టు తెలుస్తోంది. ఆ హీరోయిన్ ఎవ‌రో కాదు ఎన్టీఆర్ ప‌క్క‌న జై ల‌వ‌కుశ సినిమాలో న‌టించిన నివేదా థామ‌స్‌.


ఇప్ప‌టికే బ‌న్నీ - పూజా కాంబోలో దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ సినిమా వ‌చ్చింది. త్రివిక్ర‌మ్ సినిమాల్లో పార్వ‌తి మెల్ట‌న్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, ఈషా రెబ్బా వంటి క‌థానాయిక‌లు సెకండ్ హీరోయిన్ రోల్స్‌లో న‌టించారు. ఇప్పుడు అదే సెంటిమెంట్ కంటిన్యూ చేస్తూ బ‌న్నీ సినిమా కోసం సెకండ్ హీరోయిన్‌గా నివేదా థామ‌స్‌ను ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ జైల‌వ‌కుశలో న‌టించిన నివేద ఎన్టీఆర్‌కు యావ‌రేజ్ సినిమా ఇచ్చింది. ఇప్పుడు బ‌న్నీకి ఏం చేస్తుందో ?  చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: