కోలీవుడ్ లో యాంకర్ గా తన ప్రస్థానం మొదలు పెట్టి ఇప్పుడు అక్కడ క్రేజీ హీరోయిన్ గా మారింది ఐశ్వర్య రాజేష్. తమిళ, మళయాళ భాషల్లో సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు సినిమా సినిమాకు క్రేజ్ తెచ్చుకుంటుంది. అయితే ఏ విషయాన్నైనా సరే మొహమాటం లేకుండా చెప్పే ఐశ్వర్య రాజేష్ ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో చియాన్ విక్రం సామి స్క్వేర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.


హరి డైరక్షన్ లో సూపర్ హిట్ సినిమా సామికి సీక్వల్ గా వచ్చింది సామి-2. ఆ సినిమాలో తనది చాలా చిన్న పాత్ర అని.. రెండు సీన్స్ రెండు పాటలతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని అన్నారు ఐశ్వర్యా. ఆ సినిమా అసలు చేసుండాల్సింది కాదు. ఇక మీదట అలాంటి సినిమాలకు అసలు ఓకే చెప్పనని అంటుంది ఐశ్వర్య.


ఆ సినిమా చేసి చాలా పెద్ద తప్పు చేశానని ఐశ్వర్య అభిప్రాయపడుతుంది. సినిమాలో తనతో పాటుగా కీర్తి సురేష్ కూడా నటించింది. అసలైతే ఐశ్వర్యా రాజేష్ నటించిన పాత్రకు ముందు త్రిషను అనుకున్నారు కాని త్రిష కూడా పాత్రకు అసలు ప్రాధాన్యత లేదన్న కారణంతోనే సినిమా నుండి బయటకు వెళ్లింది.


కెరియర్ లో వచ్చిన ప్రతి అవకాశాన్ని చేస్తున్న ఐశ్వర్యా రాజేష్ విక్రం సినిమా ఆఫర్ అనగానే చేసింది. కాని చేసి ఆ సినిమా ఫెయిల్ అయ్యాక అనవసరంగా చేశానని ఫీల్ అవుతుంది. చేసిన సినిమా ఎలాగు తిరిగి రాదు కాబట్టి చేస్తున్న సినిమాల మీద దృష్టి పెడితే బెటర్. ఐశ్వర్యా రాజేష్ తెలుగులో విజయ్ దేవరకొండ సినిమాలో నటిస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: