మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైది నంబర్ 150 సినిమా టైంలో పూరి జగన్నాథ్ చిరు కోసం ఆటో జానీ సినిమా కథ సిద్ధం చేశాడు. ఈ సినిమానే చిరు రీ ఎంట్రీ మూవీ అవుతుందని భావించారు. అయితే స్టోరీ ఓకే అయినా పూరి ఇచ్చిన సెకండ్ హాఫ్ నరేషన్ నచ్చక చిరంజీవి ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టేశారు.      


అయితే రాం చరణ్ మాత్రం అప్పటి నుండి ఆటో జానీ మీద గురి పెట్టుకున్నాడట. ప్రస్తుతం పూరి జగన్నాథ్ రామ్ తో ఇస్మార్ట్ శంకర్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాతో మరోసారి తన సత్తా ఏంటో చాటాలని చూస్తున్నాడు పూరి. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది.


ఇస్మార్ట్ శంకర్ తో పూరి హిట్టు కొడితే ఆటోజానీ ఛాన్స్ ఇచ్చే ఆలోచనలో ఉన్నాడు రాం చరణ్. అది కూడా చిరు హీరోగా కాదు తనే హీరోగా ఆటోజానీ అవ్వాలని ఆలోచిస్తున్నాడట. ప్రస్తుతం మాస్ సినిమాలకు కమర్షియల్ గా ఎక్కువ వర్క్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి చరణ్ ఆటో జానీ మీద కన్నేశాడని తెలుస్తుంది. 


ప్రస్తుతం రాం చరణ్ రాజమౌళి చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాలో తారక్ తో పాటుగా చరణ్ కూడా నటిస్తున్నాడు. ఆ సినిమా తర్వాత చరణ్ పూరితోనే సినిమా ఫిక్స్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి మెగాస్టార్ చేయాల్సిన ఆటో జానీ రాం చరణ్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలి. కంటెంట్ కరెక్ట్ గా ఉంటే పూరి మళ్లీ ఫాంలోకి రావడం పెద్ద కష్టమేమి కాదు.



మరింత సమాచారం తెలుసుకోండి: