మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్-బన్నీ కాంబినేషన్‌లో కొత్త సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో ఇంతకముందు జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి తెరకెక్కాయి. ముచ్చటగా మూడోసారి ఈ కాంబినేషన్ రిపీటవడంతో ఫ్యాన్స్ లో ఆనందానికి హద్దుల్లేవు. అయితే ఒక్క షెడ్యూల్ మాత్రమే కంప్లీట్ అయిన ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ అప్‌డేట్ ఇప్పటివరకు  రానేలేదు. ఇందుకు అసలు కారణం ఏంటని ఫిల్మ్ నగర్‌లో చర్చ మొదలైంది.


అయితే తాజాగాలేటెస్ట్ గా ఫిల్మ్ లో వినిపిస్తున్న కామెంట్స్ ప్రకారం ఈ సినిమాను హారికా హాసినిలో నిర్మించడం బన్నీకి ఏ మాత్రం ఇష్టం లేదట. కానీ త్రివిక్రమ్ పట్టుబట్టడంతో ప్రొడక్షన్ మొత్తం గీత ఆర్ట్స్ బ్యానర్ కు సంబంధించిన యూనిట్ ఆధ్వర్యంలోనే నడవాలని బన్నీ కండీషన్ పెట్టాడని టాక్. దీంతో పాటు అల్లు అరవింద్ కూడా ఈ సినిమాలో మరో నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే బన్నీ ఇలాంటి నిర్ణయం తీసుకోడానికి కారణం హారికా హాసిని వారు బడ్జెట్ - ప్రొడక్షన్ విషయంలో చేసిన పొరపాట్లేనట.


ఇక కథ విషయంలో కూడా మొత్తం బౌండెడ్ స్క్రిప్ట్ తో వస్తేనే సినిమా చేద్దామని త్రివిక్రమ్ కు చెప్పాడని కూడా వార్తలు వినిపించాయి. ఇక గత ఏడాది డిసెంబర్ లో మొదలు కావాల్సిన ఈ ప్రాజెక్ట్ తాజాగా పట్టాలెక్కడం హారికా హాసిని వారిని కాస్త ఆర్ధికంగా ఇబ్బందులకు గురి చేసిందని సమాచారం. ఇందులో ఎంత వరుకు నిజం ఉందో తెలియదు కానీ - బన్నీ మాత్రం ఈసారి త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ బ్లాక్ బస్టర్ కొట్టాలనే కసితో ఉన్నాడు. ఇలాగైనా హారికా హాసిని బ్యానర్‌కి ఈ సినిమాతో మంచి కమర్షీయల్ సక్సెస్ అందుతుందేమో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: