సూపర్ స్టార్ మహేష్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో భారీ అంచనాలతో వచ్చిన సినిమా మహర్షి. మే 9న రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల మెప్పు పొందింది. మహేష్ కెరియర్ లోనే హయ్యెస్ట్ వసూళ్లు రాబట్టిన సినిమాగా మహర్షి సంచలన విజయం అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ అనీల్ రావిపుడి సినిమా చేస్తాడని తెలిసిందే.


మహర్షి సినిమా మహేష్ కెరియర్ లో 25వ సినిమా కావడంతో సూపర్ స్టార్ చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యాడు. అందుకే తనకు ఇంత మంచి హిట్ ఇచ్చిన వంశీకి మరో సినిమా ఛాన్స్ ఇస్తున్నాడట. మహర్షి కాంబినేషన్ లో మరో మూవీ వస్తుందట. అది కూడా మహర్షి లానే ఓ సోషల్ మెసేజ్ తో వస్తుందని తెలుస్తుంది.


ఇప్పటికే వంశీ పైడిపల్లి లైన్ ను మహేష్ కు వినిపించాడట. మహేష్ కూడా సరే అన్నట్టు తెలుస్తుంది. అయితే మహేష్ అనీల్ రావిపుడి సినిమా తర్వాత త్రివిక్రం, రాజమౌళి డైరక్షన్ లో సినిమా చేయాల్సి ఉంది. ఆ సినిమాల తర్వాతనే వంశీ పైడిపల్లి సినిమా ఉంటుందని చెప్పొచ్చు. హిట్ ఇచ్చిన డైరక్టర్ కు ఛాన్స్ ఇవ్వడంలో మహేష్ ఎప్పుడూ ముందుంటాడు.


సో మహేష్ మహర్షి హిట్ ఇచ్చిన వంశీకి మరో ఛాన్స్ ఇస్తున్నాడు మహేష్ బాబు. కచ్చితంగా ఇది వంశీకి మరో గొప్ప అవకాశమని చెప్పొచ్చు. మున్నా నుండి మహర్షి వరకు వంశీ పైడిపల్లి కెరియర్ లో మహర్షి ఎక్కువ పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. మహేష్ తో సినిమా కోసం మళ్లీ 2 ఏళ్లు వెయిట్ చేయాల్సిందే. ఈలోగా మరో సినిమా ఏదైనా చేస్తాడేమో చూడాలి.  
 



మరింత సమాచారం తెలుసుకోండి: