ప్రముఖ హాట్ యాంకర్ అనసూయ తాజాగా వార్తల్లోకి ఎక్కింది. గతంలో అనేక వివాదాల నడుమ వార్తల్లో నిలిచిన అనసూయ తాజాగా సరికొత్త సమస్యతో వార్తల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఇటీవల సమ్మర్ సందర్భంగా అనసూయ హాలిడేస్ కోసం నార్త్ ఇండియా జమ్మూకాశ్మీర్ లో గుల్ మార్గ్ కి వెళ్లడం జరిగింది ఇదంతా మనకందరికీ తెలిసినదే.


ఈ సందర్భంగా అనసూయ అక్కడ ఉన్న ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ వాటి ఫొటోస్ నూ సామజిక మాద్యమాల్లో షేర్ చేసి తన అభిమానులతో పంచుకున్న సంగతి కూడా మనకు తెలుసు కానీ, అనసూయ తాజాగా ఆమె ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్ జెట్‌ను క్షమాపణలు కోరడం ప్రస్తుతానికి చర్చనీయాంశంగా మారింది. సరైన కారణం తెలీదు కానీ “స్పైస్ జెట్ సారీ కోసం ఎదురుచూస్తున్నా” అంటూ ఆమె ట్విట్ చేయడంపై సోషల్ మీడియాలో వైరల్ అయింది.


అసలు అనసూయకి ఎలాంటి సమస్య ఎదురైంది. ఆమె స్పైస్ జెట్ నుంచి ఎందుకు క్షమాపణలు కోరిందనే విషయం ఇంకా కూడా తెలియడం లేదు. కాగా అనసూయ ట్వీట్‌కు స్పందించిన స్పైస్ జెట్ సంస్థ… అసలు ఏం జరిగిందో తమకు పూర్తి సమాచారం ఇవ్వాలని ఆమెకు సూచించింది. అయితే సెలవులకని వెళ్లిన అనసూయకు స్పైస్‌జెట్ సర్వీసుల్లో ఏదో ఇబ్బంది కలిగినట్టు ఉంటుందని, అందుకే తాను క్షమాపణలు కోరుతుందని పలువురు భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: