నిన్నటి ఎన్నికల ఫలితాలలో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాలలోనూ ఓటమి చెందడం పవన్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థుతులలో ఈరోజు ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పోసాని పవన్ కళ్యాణ్ పై చేసిన కొన్ని ఆసక్తికర కామెంట్స్ పవన్ అభిమానుల బెంగను కొంతవరకు తగ్గిస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాలలోనూ పవన్ ఓడిపోవడం తనకు కూడ బాధను కల్గించింది అంటూ పోసాని పవన్ వ్యక్తిత్వం పై కామెంట్స్ చేసాడు. వ్యక్తిగతంగా పవన్ చాలామంచి వ్యక్తి అనీ అయితే అతడు రాజకీయాలలోకి వచ్చి చేసిన వ్యూహాత్మక పొరపాట్లు వల్ల పవన్ కు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది అంటూ కామెంట్ చేసాడు.

రాజకీయాలలోకి రావడమే కాకుండా అవకాశాలు కలిసి వస్తే ముఖ్యమంత్రి అవతాను అని చెప్పుకునే వ్యక్తి తనకు ఏమీ తెలియదు అని అనకూడదనీ అంతేకాదు తనకన్నా చంద్రబాబు అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి 2014 ఎన్నికలలో తాను చంద్రబాబుకు సపోర్ట్ చేసాను అని చెప్పడంతో సాధారణ ఓటర్లలో పవన్ పై నమ్మకం కుదరలేదనీ అభిప్రాయ పడ్డాడు పోసాని. అంతేకాదు పవన్ చెప్పే విషయాలలో ఎటువంటి క్లారిటీ లేకపోవడం కూడ పవన్ ఓటమికి ఒక కారణం అన్న పోసాని కామెంట్స్ ఒక విధంగా పవన్ వీరాభిమానులను కూడ ఆలోచింప చేస్తుంది.

ఇదే సందర్భంలో జగన్ మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతూ పోసాని తాను జీవితంలో కోరుకున్న ఒకే ఒక్క కోరిక జగన్ ముఖ్యమంత్రిగా చూడాలి అన్నది తన చిరకాల కోరిక అనీ ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి అవుతున్న నేపధ్యంలో ఇక తనకు జీవితంలో తీరవలన కోరికలు ఏమీ లేవు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. తనకు భగవంతుడు పేరు ఐశ్వర్యం మంచి భార్య మంచి పిల్లలు ఇచ్చిన పరిస్థుతులలో తనకు ఇంక ఏ కోరికలు లేవు అంటూ తనలోని వేదాంతిని బయటపెట్టాడు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: